వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతీకారంతో మిషన్ గన్ తో కాల్పులు: ముగ్గురు పోలీసుల మృతి

|
Google Oneindia TeluguNews

కరాచీ: ప్రతీకారంతో అగంతకుడు పోలీసులు, పౌరుల వాహనాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. ఈ దాడులలో ముగ్గురు పోలీసులు మరణించి పలువురు గాయపడ్డారు. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని అధికారులు తెలిపారు.

బుధవారం పాకిస్థాన్ లోని కరాచీలోని బంగోరియా గొతి ప్రాంతంలో ఒక అగంతకుడు మిషన్ గన్ తీసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అక్కడ ఉన్న పోలీసులు, అటు వైపు వెళుతున్న వాహనాల మీద బుల్లెట్ లు దూసుకు వెళ్లాయి.

gunmen opened fire kill 3 policemen in Karachi

ఈ కాల్పులలో ఒక ఎస్ఐ, ఇద్దరు పోలీసులు సంఘటనా స్థలంలో మరణించారు. ఒక పోలీసుకు తీవ్రగాయాలైనాయని ఒక పోలీసు అధికారి తెలిపారు. వాహనాలలో వెళుతున్న వారికి గాయాలైనాయి. కాల్పులు జరిపిన అగంతకుడు అక్కడి నుండి చాకచక్యంగా తప్పించుకున్నాడు.

గొతి ప్రాంతంలో తాలిబన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. మంగళవారం భద్రత దళాలు సోదాలు చేస్తు జరిపిన కాల్పులలో నలుగురు తాలిబన్లతో సహ 7 మంది ఉగ్రవాదులు అంతం అయ్యారని అధికారులు చెప్పారు. అందుకు ప్రతీకారంగానే అగంతకుడు కాల్పులు జరిపి ఉంటాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
A sub-inspector and two constables were killed and another policeman was injured in the attack, said an official.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X