రెస్టారెంట్ లో కాల్పులు: 10 మంది కాల్చివేత
మెక్సికో: రెస్టారెంట్ లో చోరబడిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 10 మంది మరణించిన సంఘటన మెక్సికోలో జరిగింది. దాడి చేసిన దుండగులు రక్తపుమడుగులో పడి ఉన్న వారి దగ్గర ఉన్న నగదు, విలువైన వస్తులు లూటీ చేశారు.
మెక్సికోలోని అంత్యంత సంపన్నులు నివాసం ఉంటున్న మోంటరీ నగరంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఈ విదంగా ఉన్నాయి. మోంటరీ ఇండస్ట్రియల్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఒక రెస్టారెంట్ బీర్ హాలో చాల మంది కుర్చుకుని మద్యం సేవిస్తున్నారు.
అదే సమయంలో దుండగులు బైక్ లలో రెస్టారెంట్ దగ్గరికి వెళ్లారు. తరువాత రెస్టారెంట్ హాల్ లోకి వెళ్లిన దుండగులు ఒక్క సారిగా ఆయుధాలు బయటకు తీసి ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపారు. ఆ సందర్బంలో 7 మంది సంఘటనా స్థలంలో మరణించారు.
మరణించిన వారి దగ్గర, గాయాలైన వారి దగ్గర ఉన్న నగదు, విలువైన వస్తువులు లూటీ చేసిన నిందితులు అక్కడి నుండి పరారైనారు. ఆసుప్రతికి తరలించగా ముగ్గురు మరణించారు. రెస్టారెంట్ లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలలోని పుటేజీలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.