ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్నాడని తలనరికేసే శిక్ష
సౌదీ :ఉరి తీయడం, మరణదండన విధించడం లాంటి శిక్షలపై భారత్ లో నిరసనలు వ్యక్తం అవుతుంటాయి. కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో ఉరి శిక్ష అమలుపై పెద్ద ఎత్తున నిరసనలు కూడ చోటుచేసుకొంటున్న ఘటనలను మనదేశంలో చూస్తుంటాం. కాని, సౌదీలో మాత్రం ఈ రకమైన శిక్షలు సర్వసదాధారణంగా మారాయి. ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్నందుకు గాను ఓ వికలాంగుడి తలనరికేశారు అక్కడి పాలకులు.
మరణదండన ఇంకా సౌదీలోకొనసాగుతోంది. ఆ దేశంలో కఠినమైన శిక్షలు అమలు చేస్తుంటారు.కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే మరణధండనలు శిరచ్చేధనల లాంటి శిక్షలు అమలు చేస్తుంటారు అక్కడ.ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్నందుకు గాను ఓ వికలాంగుడికి తల నరివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం త్వరలోనే అమలు కానుంది.
2011లో మునీర్ అల్ అదమ్ అనే 23 ఏళ్ళ యువకుడు పాక్షికంగా బధిరుడు , అంధుడు.2011 లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో ఆయన పాల్గొనడంతో పాటుగా పోలీసులపై దాడి చేశారని ఆయనను అరెస్టు చేశారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహాణకు సందర్బంగా కొందరికి ఆయన ఎస్ ఎం ఎస్ లు పంపాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. పోలీసుల ఆరోపణలను మాత్రం మునీర్ బందువులు ఖండిస్తున్నారు.
మునీర్ ను చిత్రహింసలు పెట్టి పోలీసులు నేరం చేసినట్టు అంగీకరించేలా చేశారని మునీర్ బందువులు చెబుతున్నారు.సెల్ ఫోన్ లేని వ్యక్తి ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో పాల్గొనాలని ఎలా ఎస్ ఎం ఎస్ లు పంపుతారని మునీర్ బందువులు ప్రశ్నిస్తున్నారు. మునీర్ కు సౌదీ ప్రభుత్వం శిరచ్చేదన శిక్షను అమలు చేయాలని నిర్ణయం తీసుకొంది. తాను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని మునీర్ వాపోతున్నాడు. మరో వైపు బ్రిటన్ కు చెందిన ఓ మానవహాక్కుల సంస్థ మునీర్ కు విధించిన మరణ దండన అమలు చేయకుండా పోరాటం చేస్తోంది.