బంగ్లాదేశ్లో కిరాతకం: హిందూ యువకుడిపై కారు ఎక్కించి హత్య!
బంగ్లాదేశ్లో హిందువులే లక్ష్యంగా సాగుతున్న హింసాకాండలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాజ్బరి జిల్లాలో శుక్రవారం(జనవరి 16, 2026) ఓ హిందూ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. పెట్రోల్ నింపుకుని డబ్బులు చెల్లించకుండా పారిపోతున్న వాహనాన్ని అడ్డుకోవడమే ఆ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది.
అసలేం జరిగిందంటే?
రాజ్బరి జిల్లాలోని కరీం ఫిల్లింగ్ స్టేషన్లో 30 ఏళ్ల రిపన్ సాహా వర్కర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఒక నల్లటి ఎస్యూవీ కారు పెట్రోల్ పంపు వద్దకు వచ్చింది. సుమారు 5,000 టాకా (సుమారు రూ. 3,710) విలువైన ఇంధనాన్ని నింపుకున్న తర్వాత, డ్రైవర్ డబ్బులు ఇవ్వకుండా వాహనాన్ని వేగంగా ముందుకు పోనిచ్చాడు. వెంటనే అప్రమత్తమైన రిపన్ సాహా వాహనాన్ని ఆపేందుకు కారుకు అడ్డంగా నిలబడ్డాడు. అయితే దుండగులు కారును ఆపకుండా అతనిపై నుంచి తొక్కిస్తూ వేగంగా దూసుకెళ్లారు. ఈ ప్రమాదంలో రిపన్ సాహా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

రాజకీయ నాయకుడి అరెస్ట్
ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కారు యజమాని అబుల్ హషీమ్ (55), అతని డ్రైవర్ కమల్ హుస్సేన్ను అరెస్ట్ చేశారు. నిందితుడు అబుల్ హషీమ్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) జిల్లా మాజీ ట్రెజరర్గా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు.
🚨 Another Hindu killed in Bangladesh
— Himanshu Yadav Bjp (@bjphimanshuyadv) January 17, 2026
Rajbari: Petrol pump worker Ripon Saha (30) was run over and killed during a dispute over unpaid fuel.
Accused BNP-linked Abul Hashem and his driver have been arrested.
Serious concerns over Hindu safety persist.#Bangladesh #Hindu pic.twitter.com/lVsA2RM44Y
హిందువులే లక్ష్యంగా పెరుగుతున్న దాడులు
బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12న సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, మైనారిటీలైన హిందువులపై దాడులు ఆందోళనకరంగా పెరిగాయి. కేవలం డిసెంబర్ 2025లోనే 51 మతపరమైన హింసాత్మక ఘటనలు నమోదైనట్లు 'బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్' వెల్లడించింది. 2022 జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్లో దాదాపు 1.31 కోట్లు (7.95%) హిందువులు ఉన్నారు. మైనారిటీ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే ఈ దాడుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని భావిస్తున్నారు.
ఇటీవలి కాలంలో జరిగిన మరికొన్ని హత్యలు:
*డిసెంబర్ 2: నర్సింగ్డిలో జ్యువెలరీ వ్యాపారి ప్రంతోష్ సర్కార్ కాల్చివేత.
*డిసెంబర్ 18: మైమెన్సింగ్లో దైవదూషణ ఆరోపణలతో దీపు చంద్ర దాస్ అనే యువకుడిని గుంపుగా కొట్టి చంపి నిప్పంటించారు.
*డిసెంబర్ 31: దుండగుల దాడిలో గాయపడిన వ్యాపారి ఖోఖన్ చంద్ర దాస్ చికిత్స పొందుతూ జనవరి 3న మృతి.
*జనవరి 5: గ్రోసరీ షాపు యజమాని మణి చక్రవర్తి దారుణ హత్య.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications