దోచుకు తినండి: సైనికులకు కిమ్ ఆదేశం, పెనుముప్పే!, సంతకాలకు సిద్దమవాలన్న పుతిన్..
ఉత్తరకొరియా సైనికులకు అక్కడి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. సైనికులు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు ప్రచారం జరుగుతుండటంతో.. తిండి విషయంలో వారికి పూర్తి స్వేచ్చనిచ్చింది.
Recommended Video

పారిస్/ప్యోంగ్యాంగ్: అగ్రదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉత్తరకొరియా.. ఇకముందు కూడా తన వైఖరిని మార్చుకోబోనని స్పష్టంగా చెబుతూనే ఉంది. దీంతో ఉత్తరకొరియా పొరుగుదేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికా, రష్యా, ఇతర దేశాల్లోను తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
అణ్వాయుధాలపై ప్రశ్నిస్తున్న ప్రపంచదేశాలకు ఉత్తరకొరియా చెబుతున్న సమాధానాలు ఏమాత్రం సహించడం లేదు. తమ దేశ భద్రత కోసమే తాము అణ్వాయుధాలు తయారుచేసుకుంటున్నామని ఉత్తరకొరియా ప్రకటించింది. అది దేశ భద్రతకు సంబంధించిన అంతర్గత విషయమని సమర్థించుకుంది. దీనిపై స్పందించిన విదేశాంగ మంత్రి జీన్-యువెస్ లి డ్రియాన్ ఆందోళన వ్యక్తం చేశారు.

అలా అయితే పెనుముప్పే:
ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలు ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేలా ఉన్నాయని జీన్-యువెస్ లి డ్రియాన్ అన్నారు. దౌత్యపరమైన చర్చల ద్వారా చైనా ఈ పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన సూచించారు. అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉత్తరకొరియా గనుక సంపాదిస్తే.. యూరోప్, జపాన్, చైనా కూడా అణుదాడి పరిధిలోకి వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే పరిస్థితులు మరింత దిగజారడం ఖాయమన్నారు.

యుద్ద మేఘాలు:
యుద్దం దిశగా సాగుతున్న పరిణామాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. ఈ సంక్షోభానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఉత్తరకొరియాతో ప్రభావితమయ్యే దేశాలన్ని బేషరుతుగా చర్చల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఒత్తిళ్లు, బెదిరింపులు, యుద్ద నినాదాలు చర్చలను మరుగునపడేలా చేస్తాయని అన్నారు. ఉత్తరకొరియా అణ్వస్త్ర కార్యకలాపాలపై నిషేధం విధించడం ద్వారా ఫలితమేమి ఉండదని ఆయన పేర్కొనడం గమనార్హం.

దౌత్య ప్రణాళిక:
నిజానికి అమెరికా ఒత్తిడితో ఐరాస విధించిన ఆంక్షలకు చైనా-ఉత్తరకొరియా మధ్య సంబంధాలు బలహీనపడాల్సి ఉంది. కానీ చైనా మాత్రం తాము ఆర్థికంగా దెబ్బ తింటున్నామంటూ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది. చైనా ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోవడంతో ఉత్తరకొరియా సైతం యుద్దం ఆలోచనను తాత్కాళికంగా విరమించుకున్నట్లే కనిపించింది. కానీ ఆ తర్వాత మళ్లీ పాత కథే రిపీట్ అయింది.
ఈ నేపథ్యంలో దౌత్యపరమైన ఒప్పందాలే ఈ సమస్యకు పరిష్కారమని పుతిన్ అంటున్నారు.తాము, చైనా కలిపి తయారుచేసిన దౌత్య ప్రణాళికపై సంబంధిత దేశాలు సంతకాలు చేయాలని కోరుతున్నారు. ఉత్తరకొరియా అణ్వస్త్ర ప్రయోగాలను ఆపేయాలని, అదే సమయంలో జపాన్, దక్షిణకొరియా, అమెరికాలు యుద్ద కసరత్తులను నిలిపేయాలని చైనా, రష్యా ప్రతిపాదిస్తున్నాయి.
కాగా, తమ దేశ పౌరులు ఉత్తరకొరియాలో పర్యటించకుండా విధించిన ఆంక్షలు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి.

దోచుకు తినండి:కిమ్
ఉత్తరకొరియా సైనికులకు అక్కడి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. సైనికులు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు ప్రచారం జరుగుతుండటంతో.. తిండి విషయంలో వారికి పూర్తి స్వేచ్చనిచ్చింది.దేశంలోని మొక్కజొన్న పంటలపై పడి దోచుకు తినండి అంటూ ఆదేశాలు జారీ చేసింది.
పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు కనిపించే మొక్కజొన్న పొలాలపై పడి దొంగిలించి కావాల్సినన్ని తినొచ్చని, ఈ విషయంలో సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఎంతసేపు అణ్వాయుధాలపై ప్రయోగాలే తప్పితే.. సైనికులకు పోషకాహారం అందించాలన్న స్పృహ ఉత్తరకొరియా ప్రభుత్వానికి లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి.
అమెరికాపై ఏ క్షణంలో అయిన క్షిపణి దండయాత్ర మొదలుపెట్టడానికి సన్నద్దంగా ఉండాలన్న ఉద్దేశంతోనే కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యుద్దం వస్తే సైనికులు ధృఢంగా ఉండి ఎదుర్కోవాలని ఆయన భావిస్తున్నారు. అందువల్లే దోచుకు తినండి అంటూ ఆదేశాలు జారీ చేసేదాకా వెళ్లిపోయారు.
-
ఇరాన్ వార్ వ్యతిరేకించిన అధికారికి ట్రంప్ షాక్..! వైట్ హౌస్ కీలక నిర్ణయం..! -
తన గొయ్యి తానే తీసుకుంటున్న ట్రంప్..?? -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
హార్ముజ్ స్ట్రెయిట్ పై కన్నేసిన ట్రంప్- నాటోపై రుసరుస -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..!












Click it and Unblock the Notifications