అంతర్జాతీయ కోర్టుకు భారత్ బిగ్ షాక్- సింధు జలాలపై తాజాగా ఇదే..!
భారత్ లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తో దశాబ్దాలుగా ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని కేంద్రం నిలిపివేసింది. అయితే దీన్ని పునరుద్ధరించకపోతే తమ దేశంలో రైతులు తీవ్రంగా ఇబ్బందిపడతారని, జనానికి తాగునీరు దొరకదని పాకిస్తాన్ వేడుకుంది. అయితే భారత్ (india) స్పందించకపోవడంతో అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన అంతర్జాతీయ కోర్టు పాకిస్తాన్ కు సింధు జలాల్ని విడుదల చేయాలని భారత్ ను ఆదేశించింది. దీన్ని భారత్ తోసిపుచ్చింది.
అంతర్డాతీయ కోర్టుకు భారత్ షాక్ (india)
అసలు అంతర్జాతీయ కోర్టు పరిధినే తాము గుర్తించడం లేదని, సింధు జలాల విషయంలో పాకిస్తాన్ వేసిన పిటిషన్ పై విచారణకు సైతం హాజరు కాబోమని తేల్చిచెప్పేసింది. అయితే తాజాగా మరోసారి ఇదే అంశంపై అంతర్జాతీయ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సింధు జలాల ఒప్పంద చట్రం కింద కొత్త విచారణలు, డాక్యుమెంట్ ఆదేశాలతో ముందుకు సాగుతున్నప్పటికీ, ఈ చర్యల చట్టబద్ధతను తాము గుర్తించడం లేదని, ఇందులో పాల్గొనబోమని భారతదేశం స్పష్టం చేసింది.

చట్టబద్ధతను గుర్తించని భారత్
వాస్తవానికి సింధు జలాల ఒప్పందం కింద ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు గతవారం జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదం అయ్యాయి. ఇది భారత జలవిద్యుత్ ప్లాంట్ల నుండి రెండో దశ కింద నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. అలాగే ఇవాళ, రేపు హేగ్లోని పీస్ ప్యాలెస్లో విచారణల్ని ఖరారు చేసింది. అలాగే భారత్ తో సంబంధం లేకుండా పాకిస్తాన్ ను హాజరు కావాలని ఆదేశించింది. అలాగే భారత్ తమ వాదనలు సమర్పించలేదని కూడా పేర్కొంది. దీనిపై స్పందించిన భారత్... సింధు జలాల ఒప్పందంపై చట్ట విరుద్దంగా ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు చట్టబద్ధతను తాము గుర్తించినందున, దానికి ఎలాంటి సమాచారం ఇచ్చేది లేదని తేల్చేసింది.

భారత్ లేకుండా అసాధ్యం
మరోవైపు గతంలో కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం ఏవైనా వివాదాలు తలెత్తితే దాన్ని ప్రపంచ బ్యాంక్ కు చెందిన తటస్థ నిపుణుడికి నివేదించాలి. అయితే చట్టపరమైన వివాదాలు మాత్రం మధ్యవర్తిత్వ న్యాయస్థానానికి వెళ్తాయి. ప్రస్తుత సమస్యలు తటస్థ నిపుణుల పరిధిలోకి వస్తాయని, కోర్టును ఇందులోకి లాగాలని పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు ఫోరమ్ షాపింగ్ కిందకు వస్తాయని భారత్ వాదిస్తోంది. అయినా భారత్ లేకుండా ఈ విచారణ ముందుకెళ్లే పరిస్ధితి మాత్రం కనిపించడం లేదు.
-
మొదటి రోజే పరువు పాయే! తెల్ల బంతి కాస్తా గులాబీగా మారింది! -
"పాకిస్థాన్ లో నిద్రలేచిన నరరూప రాక్షసులు.. భారత్ కు పెను ముప్పు" -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!!












Click it and Unblock the Notifications