ఆ దేశంలో భారత్, పాక్ విద్యార్థులపై దాడులు-ముగ్గురు మృతి-ఎంబసీల అలర్ట్..!
విదేశాల్లో భారత ఉపఖండపు దేశాల్లో ఉన్న విద్యార్ధులకు నానాటికీ రక్షణ కరవవుతోంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాల్లో మన విద్యార్థులపై దాడులు పెరుగుతుండగా.. ఇప్పుడు కిర్గిజిస్తాన్ లోనూ భారతీయ విద్యార్ధులు టార్గెట్ అయ్యారు. స్థానికంగా ఉన్న ఓ హాస్టల్లో చెలరేగిన ఘర్షణ అంతకంతకూ పెద్దది కావడంతో స్థానికులు వర్సెస్ విదేశీయులుగా పరిస్ధితి మారిపోయింది. అనంతరం భారత్, పాకిస్తాన్ విద్యార్థులపై స్దానికులు తీవ్ర దాడులు చేస్తున్నారు.
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో రెండు రోజులుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు చెందిన హాస్టళ్లను ఆగంతకులు టార్గెట్ చేసుకున్నారు. ఈ దాడుల్లో ముగ్గురు పాకిస్తానీ విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ, ఇస్లామాబాద్ లోని ఎంబసీలు కిర్గిజిస్తాన్ లో ఉన్న తమ విద్యార్ధులను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. పాకిస్థానీలు, ఈజిప్షియన్లతో సహా స్థానికులు, విదేశీ విద్యార్థుల మధ్య హాస్టల్లో తలెత్తిన ఓ ఘర్షణ తర్వాత హింస చెలరేగిందని తెలుస్తోంది.

⚠️Violence allert #Bishkek, Kyrgyzstan: Indian embassy asks students in #Kyrgyzstan to stay indoors amid violent protests in Bishkek.
— Dilshad Hussain (@DilshadOnX07) May 18, 2024
An altercation between local and #Egyptian students at a hostel in Kyrgyzstan on May 13 sparked protests in Bishkek on Friday.
#Bishkek, pic.twitter.com/PiGv0iMkSS
మే 13న జరిగిన ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హాస్టల్ లో జరిగిన గొడవ కాస్తా వీధులకు వ్యాపించడంతో స్థానికులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చారు. గూండాయిజం ఆరోపణలతో స్థానిక పోలీసులు ముగ్గురు విదేశీ విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఉంటున్న మెడికల్ యూనివర్శిటీల హాస్టళ్లను స్దానికులు లక్ష్యంగా చేసుకోవడంతో ఉద్రికతలు కొనసాగుతున్నాయి. పరిస్ధితులు చక్కబడే వరకూ విద్యార్ధులు హాస్టళ్లలోనే ఉండాలని ఎంబసీలు కోరుతున్నాయి.
-
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications