తగ్గేదేలే..! నాటో వార్నింగ్ కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!
అమెరికాతో పాటు పశ్చిమ దేశాల కూటమి నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) తాజాగా భారత్ తో పాటు చైనా, బ్రెజిల్ పై ఆంక్షలు తప్పవని హెచ్చరికలు చేసింది. ఉక్రెయిన్ తో పోరాడుతున్న రష్యా నుంచి చమురు కొంటూ ఆర్ధికంగా ఊతమిస్తున్న ఆయా దేశాలపై ఆంక్షలు విధిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే వార్నింగ్ ఇచ్చారు. దీనిపై భారత్ ఇవాళ అంతే దీటుగా స్పందించి కౌంటర్ ఇచ్చింది.
రష్యాతో వాణిజ్యం చేస్తున్నామన్న కారణంతో ఆంక్షలు ఎదుర్కోక తప్పదన్న నాటో ఛీఫ్ వార్నింగ్ పై విదేశాంగశాఖ ఇవాళ ఘాటుగా స్పందించింది. విదేశాంగశాఖ తరపున అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ నాటో ఛీఫ్ హెచ్చరికలపై స్పందిస్తూ ద్వంద్వ ప్రమాణాలు వీడాలని సూచించారు. తమ ప్రజల అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన తేల్చిచెప్పేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు.

అంతర్జాతీయ పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని తాము చమురు కొనుగోళ్లు జరుపుతున్నట్లు రణ్ ధీర్ జైశ్వాల్ నాటో అధిపతికి తెలిపారు. ఈ విషయంలో ద్వంద ప్రమాణాలు వద్దని ఆయనకు సూచించారు. తద్వారా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తామని నాటోకు తేల్చిచెప్పేసినట్లయింది. రెండు రోజుల క్రితం అమెరికా కాంగ్రెస్ కు వెళ్లిన నాటో ఛీఫ్ అక్కడి సెనేటర్లతో కలిసి రష్యాకు మద్దతు ఇస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ కు తమ బంధాలపై పునరాలోచించుకోవాలని కోరారు.
#WATCH | Delhi | On Nato chief Mark Rutte's comment that countries buying Russian oil could face secondary sanctions, MEA spokesperson Randhir Jaiswal says, "We have seen reports on the subject and are closely following the developments. Let me reiterate that securing the energy… pic.twitter.com/SdhmWRQYLL
— ANI (@ANI) July 17, 2025
ఇప్పటికే రష్యాతో యుద్దంలో ఉక్రెయిన్ సుదీర్ఘకాలం పోరాడుతున్నా, తాము మద్దతిస్తున్నా విజయం సాధించలేకపోవడానికి కారణం భారత్, చైనా, బ్రెజిలే అని భావిస్తున్న ట్రంప్.. ఈ మూడు దేశాలపై భారీగా సుంకాలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం నాటో ఛీఫ్ కూడా ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. అయినా భారత్ మాత్రం రష్యా విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పేయడంతో నాటో, అమెరికా ఈ విషయంలో తదుపరి తీసుకోబోయే చర్యలపై ఉత్కంఠ నెలకొంది.

వాస్తవానికి ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ మొదలుపెట్టి రెండేళ్లవుతోంది. అయితే మధ్యలో ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికాతో పాటు ఇతర నాటో దేశాలు ఎంటరై సాయం చేయడం ప్రారంభించాయి. ఆయుధాలతో పాటు భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లు, డబ్బు సాయం చేస్తుండటంతో ఉక్రెయిన్ ఇంకా రష్యాపై పోరు కొనసాగిస్తోంది. దీంతో తమ ఆర్ధిక వ్యవస్ధలు దెబ్బతింటున్నాయని నాటో దేేశాలు సైతం గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ తో పాటు చైనా, బ్రెజిల్ కు అమెరికా, నాటో హెచ్చరికలు చేస్తున్నాయి.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
గ్యాస్, పెట్రోల్, డీజిల్ పై ఏపీ వాసులకు సూపర్ న్యూస్.. మీకు దిగులు లేదు! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications