Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తాలిబాన్‌కు స్పాన్సర్ భారత్: ఇప్పుడు కొత్త గోల!

ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభంలో మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆహ్వానిస్తున్నట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. ఈ సందర్భంగా భారత్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ.. ఇండియా తాలిబాన్‌కు స్పాన్సర్ చేస్తోందని.. తమకు వ్యతిరేకంగా పరోక్ష యుద్ధం చేస్తోందని ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన ఖవాజా ఆసిఫ్.. ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. "యుద్ధాలను ఆపిన తొలి అమెరికా అధ్యక్షుడు" ట్రంప్ అని ఆయన అభివర్ణించారు.

ట్రంప్‌కు పాకిస్తాన్ స్వాగతం
"అమెరికాలో అధ్యక్షులు యుద్ధాలకు కారణమయ్యారు. కానీ ట్రంప్ యుద్ధాలను ఆపిన మొదటి అధ్యక్షుడు. గత 15-20 ఏళ్లుగా అమెరికా యుద్ధాలకు మద్దతు ఇచ్చింది, కానీ ట్రంప్ శాంతి చర్చలు జరిపిన మొదటి అధ్యక్షుడు. ఆయన పాకిస్తాన్-అఫ్ఘానిస్తాన్ యుద్ధంపై దృష్టి పెట్టాలనుకుంటే, 'మోస్ట్ వెల్‌కమ్'" అని ఖవాజా ఆసిఫ్ అన్నారు. గతంలో కూడా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లతో సహా పాకిస్తాన్ నాయకత్వం పలుమార్లు ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పుడు కూడా, ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని షరీఫ్ స్వాగతించారు.

India Sponsoring Taliban Pakistan Explosive Claim Trump Invited as Mediator

భారత్‌పై పాకిస్తాన్ సంచలన ఆరోపణలు
ఒకే మాటలో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌పై విచిత్రమైన ఆరోపణలు చేశారు. "భారత్ తాలిబాన్‌కు స్పాన్సర్ చేస్తూ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పరోక్ష యుద్ధాన్ని నడుపుతోంది" అని ఆయన ఆరోపించారు.

నేను యుద్ధాలను ఆపడం అంటే ఇష్టపడతాను': ట్రంప్
ఈ మధ్యవర్తిత్వ ఆహ్వానం కంటే ఒక రోజు ముందు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన శాంతి స్థాపన సామర్థ్యాలను హైలైట్ చేసుకున్నారు. "8 నెలల్లో 8 ప్రధాన ప్రపంచ ఘర్షణలను నేను ఆపేశాను. ఎవరైనా అధ్యక్షుడు ఒక్క యుద్ధాన్నైనా ఆపారని నేను అనుకోను. నేను ఎనిమిది నెలల్లో ఎనిమిది యుద్ధాలను ఆపేశాను." అని ట్రంప్ ప్రకటించారు. టారిఫ్‌లతో బెదిరించి భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానని మళ్లీ పునరుద్ఘాటించారు.

"నాకు నోబెల్ బహుమతి వచ్చిందా? లేదు... కానీ వచ్చే సంవత్సరం మెరుగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. అయితే నేను దేని గురించి పట్టించుకుంటాను? నేను బహుశా వందల మిలియన్ల జీవితాలను కాపాడాను" అని ట్రంప్ అన్నారు. అయితే ఈ విషయంలో అమెరికా జోక్యాన్ని భారత్ తోసిపుచ్చింది. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మాట్లాడుతూ.. "రెండు సైన్యాల మధ్య నెలకొన్న ప్రస్తుత మార్గాల ద్వారా భారత్, పాకిస్తాన్ మధ్య చర్చలు నేరుగా జరిగాయి" అని స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+