వగలమారీ పాకిస్తాన్: ఇద్దరు ఇండియన్ హై కమిషన్ సిబ్బంది అరెస్ట్, హిట్ అండ్ రన్ కేసు అట..
పాకిస్తాన్లో ఇద్దరు ఇండియన్ హై కమిషన్ సిబ్బందిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిట్ అండ్ రన్ కేసులో వారిని అరెస్ట్ చేసినట్టు పాకిస్తాన్ మీడియా కోడై కూస్తోంది. ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది పాదచారులను ఢీ కొట్టి, పారిపోయారని.. ఆ కేసులో అరెస్ట్ చేసినట్టు తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ దృష్టికి భారత అధికారులు తీసుకెళ్లారు.
భారత రాయబార కార్యాలయంలో పనిచేసే ఇద్దరు జూనియర్ సిబ్బంది రాయబార కార్యాలయానికి ఉదయం 8.30 గంటలకు బయల్దేరారు. కానీ వారు గమ్యం చేరుకోలేదు. దీనిపై విదేశాంగ శాఖ పాకిస్తాన్కు సమన్లు జారీచేసింది. భారత అధికారులను అరెస్ట్ చేసి, వేధించడం సరికాదని అభిప్రాయపడింది. అధికారులను సురక్షితంగా అప్పగించాల్సిన బాధ్యత పాకిస్తాన్పై ఉంది ని పేర్కొన్నారు. ఇద్దరు అధికారులను వెంటనే విడుదల చేయాలని కోరింది. గూఢచర్యం ఆరోపణలపై ఇద్దరు పాకిస్తాన్ హై కమిషన్ అధికారులను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇస్లామాబాద్లో భారతీయ అధికారులను అరెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అబిడ్ హుస్సేన్, మహ్మద్ తాహీర్ అనే ఇద్దరు పాక్ హై కమిషన్ అధికారులను.. గూఢచర్యం పేరుతో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే పాకిస్తాన్.. ఆ దేశంలో ఉన్న ఇండియన్ హై కమిషన్ అధికారులు.. భారతీయ అధికారులను అరెస్ట్ చేశారు. పాకిస్తాన్లో ఇండియన్ హై కమిషన్లో పనిచేస్తున్న గౌరవ్ అహ్లూవాలియా కారును అక్కడి అధికారులు వెంబడించారు. పాకిస్తాన్ అధికారుల గూఢచర్యంతో అరెస్ట్ చేయడంతో.. ప్రతీగా స్పందించారు.