హత్య: అమెరికాలో భారతీయుడికి 82 ఏళ్ల జైలు శిక్ష
శాన్ఫ్రాన్సిస్కో: 2008లో జరిగిన ఓ గొడవలో ఓ వ్యక్తిని హత్య చేసి, మరో వ్యక్తిని గాయపర్చిన వ్యక్తికి అమెరికాలోని న్యాయస్థానం 82 ఏళ్ల జైలు శిక్ష విధించింది. భారత్కు చెందిన అమన్దీప్ సింగ్ అనే వ్యక్తికి పరంజీత్ సింగ్ అనే మరో భారతీయుడితో వ్యక్తిగత గొడవలున్నాయి.
ఈ నేపథ్యంలో పరంజీత్ సింగ్తో కలిసి 2008 ఆగస్టు 31న సక్రామెంటో సిక్కు స్పోర్ట్స్ క్లబ్లోని ఓ వేడుకకు హాజరయ్యాడు. ఇదే ఫంక్షన్కు మరో సన్నిహితుడితో వెళ్లిన అమన్దీప్ సింగ్ పరంజీత్ సింగ్తో గొడవపడ్డాడు. పరంజీత్ను తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశాడు.

హత్య అనంతరం అమన్ సింగ్ భారత్కు పారిపోయాడు. కేసు విచారణ నేపథ్యంలో.. అమన్దీప్ను అరెస్టు చేసిన భారత్ అధికారులు అమెరికాకు అప్పగించారు. 2013లో పంజాబ్లోని జలంధర్లో అతనిని అరెస్టు చేశారు.
అతనిని అమెరికాకు అప్పగించిన అనంతరం.. హత్యానేరం కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఈ కేసులో జనవరి 22న తుది తీర్పు వెలువడింది. అమన్దీప్ సింగ్ను దోషిగా గుర్తిస్తూ సక్రామెంటో కోర్టు 82ఏళ్ల జైలుశిక్ష విధించింది.












Click it and Unblock the Notifications