Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇరాక్‌లో ఉగ్రవాదుల మారణహోమం, ఒకే ప్రాంతంలో రెండుసార్లు దాడి, 60 మంది మృతి

ఇరాక్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఒకే ప్రాంతంలో రెండుసార్లు దాడికి దిగారు. నసిరియా ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు అక్కడ ఉన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

నసిరియా: ఇరాక్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఒకే ప్రాంతంలో రెండుసార్లు దాడికి దిగారు. నసిరియా ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు అక్కడ ఉన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఈ ఘటన జరిగిన కొద్ది సమయానికి దగ్గర్లోని భద్రతా సిబ్బంది చెక్‌ పాయింట్‌ వద్ద కారు బాంబుతో దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 90 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

iraq-twin-incidents

ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. దాడి కారణంగా ఆ ప్రాంతమంతా ఛిద్రమైన శరీరాలు, రక్తంతో భీతావహంగా మారింది.

మృతుల్లో ఏడుగురు ఇరానీయులు కూడా ఉన్నట్లు ఆ ప్రాంత అధికారి జస్సీమ్‌ అల్‌ ఖాలిది తెలిపారు. ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. కానీ ఇవి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దుశ్చర్యలుగానే భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+