ఐసిస్ క్రూరమైందే, అమెరికా అంతకంటే ఎక్కువ: దీపా
రట్జర్స్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా పని చేస్తున్న దీపా కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐసిస్ కంటే అమెరికా చాలా క్రూరమైనదని మడిపడ్డారు.
ఐసిస్ ఉగ్రవాదం చాలా తీవ్రమైనదేనని, వారు చాలా మందిని చంపారని, కానీ ఇరాక్, ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్ దేశాల్లో అమెరికా అంతకన్నా ఎక్కువ మందిని మట్టుబెట్టిందన్నారు. ఐసిస్ క్రూరమైనదేనని చెప్పారు. అయితే, అమెరికా అంతన్నా ఎక్కువ క్రూరమైందన్నారు.
దీపా కుమార్ ఇండియన్-అమెరికన్. ఆమె చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం లేపాయి. రట్జర్స్ యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న దీపా తన అమెరికా వ్యతిరేక, యుద్ధ వ్యతిరేక విమర్శలు చేస్తూ ఈ వ్యాఖ్యలను మార్చి 26న ట్వీట్ చేశారు.
ఆమె వ్యాఖ్యలపై అమెరికాలో ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆమె తక్షణం దేశం విడిచిపోవాలని డిమాండ్ చేశారు. కొంతమంది ఆమె తన భావ ప్రకటన హక్కును వినియోగించుకున్నారని మద్దతిచ్చారు.