ఆ భూకంపంతో ఎత్తు తగ్గిందా?: ఎవరెస్ట్ను మళ్లీ కొలవనున్నారు
ఎవరెస్టు పర్వతాన్ని మరోసారి కొలవనున్నారు. మూడు నెలల్లో దీని ఎత్తు ఇప్పుడు ఎంత ఉందో నిర్ధారించనున్నారు.
న్యూఢిల్లీ: ఎవరెస్టు పర్వతాన్ని మరోసారి కొలవనున్నారు. మూడు నెలల్లో దీని ఎత్తు ఇప్పుడు ఎంత ఉందో నిర్ధారించనున్నారు. ఎవరెస్ట్ ఎత్తును కొలవడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సిద్ధమైంది.
దీనిని మరో రెండు నెలల్లో ప్రారంభించనున్నట్లు సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ స్వర్ణ సుబ్బారావు తెలిపారు. ఎత్తును కొలవడానికి సుమారు నెల రోజులు సమయం తీసుకునే అవకాశముందన్నారు.

హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఎవరెస్ట్.. 8,848 మీటర్లతో ప్రపంచంలోనే ఎత్తైన శిఖరంగా ఉంది. నేపాల్లో రెండేళ్ల క్రితం సంభవించిన తీవ్ర భూకంప నేపథ్యంలో ఎవరెస్ట్ ఎత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నేపాల్లో వచ్చిన భూకంపం కారణంగా టెక్టానిక్ పలకల్లో మార్పులు వచ్చి, ఎవరెస్ట్ ఎత్తుపై ప్రభావం చూపి ఉంటుందనే వాదన ఉంది.
దీంతో ఎవరెస్ట్ ఒక అంగుళం మేర తగ్గి ఉంటుందని కొంతమంది శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది చర్చనీయాంగా మారింది. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్ ఎత్తును కొలిచే బాధ్యతను జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తీసుకుంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications