వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యంత క్రూరంగా ఒకేసారి 21 మంది తలలు నరికిన ఐసీస్ ఉగ్రవాదులు (వీడియో)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ట్రిపోలి: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి తమ క్రూరత్వంతో రెచ్చిపోయారు. ఈజిప్ట్‌కు చెందిన 21 మంది కాప్టిక్ క్రిస్టియన్స్‌ను లిబియాలోని ట్రిపోలీ సమీపంలో గల సమద్ర తీరంలో తలలు తెగ్గోసి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఇంటర్నెట్లో విడుదల చేశారు.

ఇస్లామికి స్టేట్స్ కాక సరిహద్దు దేశమైన ఈజిప్ట్ వచ్చి ఉగ్రవాదులు ఈ దారుణానికి తెగబడటం ఆ ప్రాంతంలో వారి ప్రాబల్యం మరింతగా పెరుగుతోంది అనడానికి సంకేతాలని, దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ఈజిప్టులోని మానవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అత్యంత భయంకరంగా ఉన్న ఈ వీడియోని చూసిన వారంతా ఐసీస్ ఉగ్రవాదులు దుశ్శర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు.

ISIL video shows Christian Egyptians beheaded in Libya

కొన్ని వారాల క్రితం ఉగ్రవాదులు లిబియా నుంచి కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. వారికి ఆరెంజ్ కలర్ దుస్తులు వేసి, సముద్ర తీరం వెంబడి నడిపంచుకుంటూ తీసుకువచ్చి, మోకాళ్లపై కూర్చోబెట్టారు. ముఖాలకు నల్లటి ముసుగులు ధరించిన ఐసీస్ ఉగ్రవాదులు పదునైన కత్తులతో వారి గొంతులు కోశారు.

ఉగ్రవాదులు లీడర్‌గా భావిస్తున్న వ్యక్తి బందీలుగా ఉన్న ఒక వ్యక్తి తల నరికిన తర్వాత తన కత్తిని కెమెరా వైపు విసిరినట్లుగా ఈ వీడియోలో కనిపించింది. ఐసీస్ ఉగ్రవాదలు అత్యంత క్రూరంగా బందీలను చంపిన వీడియోని మీరు కింద చూడొచ్చు.

English summary
Fighters pledging allegiance to the Islamic State of Iraq and the Levant (ISIL) have released a video purporting to show the killing of 21 Egyptian Coptic Christians kidnapped in Libya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X