వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసిస్ షాక్: కొడుకును ముక్కలు చేసి.. కన్నతల్లికి భోజనంగా పెట్టారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

సిరియా: ఇస్లామిక్ స్టేట్స్ (ఐసిస్) తీవ్రవాదుల అఘాయిత్యాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. తాజాగా మరో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఐసిస్ ఉగ్రవాదులు. అతనిని చంపేశారు. అనంతరం అతనిని మాంసంగా వండి స్వయంగా అతని తల్లికి తినిపించారు.

బ్రిటిష్‌కు చెందిన ఓ వ్యక్తి ఇస్లామిక్ స్టేట్స్ తీవ్రవాదం పైన పోరాడేందుకు వెళ్లాడు. అతని పేరు యాసిర్ అబ్దుల్లా. అతను వందలాది మందితో పాటు కలిసి పోరాడేందుకు వెళ్లాడు. అయితే అతనిని ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు.

Isis ‘fed murdered kidnap victim to his own mother

ఆ తర్వాత ఆయన తల్లి ఐసిస్ స్థావరాలకు వచ్చింది. కిడ్నాప్ చేసిన తన కొడుకును విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అయితే, వారికి ఐసిస్ ఉగ్రవాదులు షాకిచ్చే విందు పెట్టారు!

ఆమెకు వారు చాయ్ ఇచ్చారు. ఆ తర్వాత భోజనం పెట్టారు. అందులోకి మాంసం, అన్నం వడ్డించారు.

ఆమె తన కొడుకును చూపించాలని వారిని డిమాండ్ చేసింది. అప్పుడు వారు వికృతంగా నవ్వారు. ఆ తల్లికి షాకిచ్చే వార్తను చెప్పారు. మేం నీ కొడుకును చంపామని, అతనిని ముక్కులుముక్కలుగా కోసి, నీకు భోజనంగా పెట్టామని చెప్పారు.

English summary
A British fighter who travelled to Iraq to stop the Islamic State claims the terror group fed a murdered kidnap victim to his own mother after she went to their headquarters and demanded to see him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X