ఐసిస్ షాక్: కొడుకును ముక్కలు చేసి.. కన్నతల్లికి భోజనంగా పెట్టారు
సిరియా: ఇస్లామిక్ స్టేట్స్ (ఐసిస్) తీవ్రవాదుల అఘాయిత్యాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. తాజాగా మరో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఐసిస్ ఉగ్రవాదులు. అతనిని చంపేశారు. అనంతరం అతనిని మాంసంగా వండి స్వయంగా అతని తల్లికి తినిపించారు.
బ్రిటిష్కు చెందిన ఓ వ్యక్తి ఇస్లామిక్ స్టేట్స్ తీవ్రవాదం పైన పోరాడేందుకు వెళ్లాడు. అతని పేరు యాసిర్ అబ్దుల్లా. అతను వందలాది మందితో పాటు కలిసి పోరాడేందుకు వెళ్లాడు. అయితే అతనిని ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు.
ఆ తర్వాత ఆయన తల్లి ఐసిస్ స్థావరాలకు వచ్చింది. కిడ్నాప్ చేసిన తన కొడుకును విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అయితే, వారికి ఐసిస్ ఉగ్రవాదులు షాకిచ్చే విందు పెట్టారు!
ఆమెకు వారు చాయ్ ఇచ్చారు. ఆ తర్వాత భోజనం పెట్టారు. అందులోకి మాంసం, అన్నం వడ్డించారు.
ఆమె తన కొడుకును చూపించాలని వారిని డిమాండ్ చేసింది. అప్పుడు వారు వికృతంగా నవ్వారు. ఆ తల్లికి షాకిచ్చే వార్తను చెప్పారు. మేం నీ కొడుకును చంపామని, అతనిని ముక్కులుముక్కలుగా కోసి, నీకు భోజనంగా పెట్టామని చెప్పారు.