మమ్మల్ని భయపెట్టలేరు: కాలిఫోర్నియా ఘటనపై ఒబామా
న్యూఢిల్లీ: ఉగ్రవాదులు అమెరికన్లలో భయాన్ని పెంచలేరని ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. కాలిఫోర్నియాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంగా తన వారాంతపు ప్రసంగం చేసిన ఒబామా, ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకొనే క్రమంలోనే కాలిఫోర్నియాలో తెగబడ్డారని తెలిపారు.
ఎక్కడ ఏ రూపంలో ఉగ్రవాదం దాగున్నా, దాన్ని అంతమొందించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. "మేము అమెరికన్లం. మేము బలవంతులం. మా స్వేచ్ఛను మేము కాపాడుకుంటాం. మమ్మల్ని భయపెట్టలేరు" అని ఆయన అన్నారు. దేశంలో తుపాకీ నియంత్రణ చర్యలను మరింత పటిష్టం చేయాలని మరోమారు ఆదేశించారు.
ఐఎస్తోపాటు ఇతర ఉగ్రవాద గ్రూపులు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను హింసకు ప్రేరేపిస్తున్నాయని ఒబామా పేర్కొన్నారు. ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ బెర్నాండినోలో ఓ సామాజిక సేవా కేంద్రంపై దాడి చేసి 14 మందిని హతమార్చిన దంపతులు తమ అనుచరులేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఆన్లైన్ రేడియోలో ప్రకటించింది.

ఈ నెల రెండో తేదీన భార్యాభర్తలు ఓ హాలిడేపార్టీపై విరుచుకుపడి విచక్షణారహితంగా కాల్పులు జరిపడంతో వీరంతా ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ ఇద్దరిని కాల్చి చంపారు. వీరిని తష్ఫీన్ మాలిక్, సయ్యద్ రిజ్వాన్ ఫరూక్లుగా గుర్తించారు.
కాగా, కాలిఫోర్నియాపై దాడి చేసిన పాక్ దంపతులను పొగడుతూ, ఐఎస్ఐఎస్ సొంత రేడియో ప్రత్యేక వార్తలను ప్రసారం చేసింది. వారు ఇస్లామిక్ రాజ్యం కోసం మరణించి దేవుడిని చేరిన గొప్పవారని ఉగ్రవాద సంస్థ వ్యాఖ్యానించింది. ఈ దంపతులు తమ సభ్యులేనని ఐఎస్ రేడియో వెల్లడించింది. ఆ దాడికి, ఐఎస్కు ఉన్న సంబంధంపై వారు ట్వీట్ చేశారు.
కానీ అమెరికా ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. ఉగ్రవాద సంస్థ ఆదేశానుసారమే దాడి జరిగిందనడానికి ఆధారాలు లేవని అవి అంటున్నాయి. కనీసం ఐఎస్ సంస్థకు ఆ దంపతులెవరో తెలిసినట్టు కూడా సాక్ష్యాలు లేవని తెలిపాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications