Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రక్తమోడిన గాజా: ఇజ్రాయెల్ దాడుల్లో 100కి పైగా మృతి..యుద్ధానికి అంతమెప్పుడు..?

Israel Airstrikes on Gaza:గాజా మరోసారి రక్తమోడింది. అక్కడ ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు, కాల్పుల్లో 100కు పైగా పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో అత్యవసర సహాయం కోసం ఎదురు చూస్తున్న 45 మంది కూడా ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.ఈ దాడులపై ఇజ్రాయెల్ సైన్యం వెంటనే స్పందించలేదు.

గాజా స్ట్రిప్‌లోని ప్రజలకు ఆహారం అందించడానికి ఇజ్రాయెల్ మద్దతుతో కొత్తగా ఏర్పాటైన గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ వెలుపల ఐదుగురు చనిపోయారు. సహాయం కోసం వేచి చూస్తున్న మరో 40 మంది గాజా స్ట్రిప్‌లోని ఇతర ప్రాంతాల్లో మరణించారు.గురువారం ఉదయం వరకు జరిగిన వైమానిక దాడుల్లో అనేక మంది మరణించారు. మువాసి ప్రాంతంలో టెంట్లలో ఆశ్రయం పొందుతున్న 15 మంది కూడా మరణించారు. గాజా నగరంలోని ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 15 మంది చనిపోయారు.

Israel airstrikes along Gaza

మరణాల సంఖ్య 57,000 దాటింది

అక్టోబర్ 7, 2023 నుండి గాజాలో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 57,000 దాటిందని, తప్పిపోయిన వారిలో 223 మందిని చనిపోయినట్లు ప్రకటించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణించిన వారిలో సగం మంది మహిళలు, పిల్లలేనని పేర్కొంది. అయితే, ఈ లెక్కల్లో పౌరులు, సైనికుల వివరాలు వేర్వేరుగా లేవని తెలిపింది.

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్న సమయంలో ఈ మరణాలు సంభవించాయి. చర్చలు సఫలమైతే 21 నెలల యుద్ధానికి ముగింపు పలికే అవకాశం ఉంది.

ఇజ్రాయెల్ 60 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించిందని, పరిస్థితులు దిగజారకముందే హమాస్ ఈ ఒప్పందాన్ని అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం అన్నారు. అయితే, యుద్ధం ముగియాలనే డిమాండ్‌ను హమాస్ నొక్కి చెప్పడంతో తాజా ప్రతిపాదన కార్యరూపం దాల్చుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

హమాస్ దాడుల వల్లే సాధారణ ప్రజలు చనిపోతున్నారని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపిస్తోంది. హమాస్ మిలిటెంట్లు జనావాస ప్రాంతాల నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పేర్కొంది. బుధవారం ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించినందుకు గాజాలో హమాస్ మిలిటెంట్లు, రాకెట్ లాంచర్‌లను లక్ష్యంగా చేసుకున్నామని సైన్యం తెలిపింది.

హమాస్ మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1,200 మందిని చంపడం, 250 మందిని బందీలుగా తీసుకోవడంతో యుద్ధం ప్రారంభమైంది.ఈ యుద్ధం పాలస్తీనా భూభాగాన్ని నాశనం చేసింది. పట్టణ ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి. గాజాలోని 2.3 మిలియన్ల జనాభాలో 90% కంటే ఎక్కువ మంది నిరాశ్రయులయ్యారు. వందల వేల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. యుద్ధం కారణంగా గాజాలో తీవ్ర మానవతా సంక్షోభం ఏర్పడింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+