Israel Yemen War: ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్.. యెమెన్పై విరుచుకుపడిన ఇజ్రాయెల్
Israel Yemen War: ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య శాంతి నెలకొన్నప్పటికీ.. ఇజ్రాయెల్ ఇప్పుడు మరో కొత్త దేశంపై దాడి చేసింది. ఇజ్రాయెల్ దాడి చేసిన ఆ దేశం యెమెన్. ఇజ్రాయెల్ యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుంది. దీని కారణంగా మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. "ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్" ద్వారా ఇజ్రాయెల్ యెమెన్ పశ్చిమ భాగంలో ఉన్న మూడు ప్రధాన నౌకాశ్రయాలపై దాడి చేసింది. ఇజ్రాయెల్ వైమానిక దళం యెమెన్లోని హౌతీ నియంత్రణలోని హుదైదా, రాస్ ఈసా, సైఫ్ ఓడరేవులపై భారీ వైమానిక దాడులు చేసింది. హౌతీల మిస్సైల్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈ దాడి చేసింది. అంతకు ముందు ఇజ్రాయెల్ ఇరాన్ అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే.
దాడికి ముందు ఇజ్రాయెల్ యెమెన్లోని హుదైదా, రాస్ ఈసా, సైఫ్ ప్రాంతాల పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లమని సూచించింది. ఇజ్రాయెల్ వైమానిక దళం ఎప్పుడైనా దాడి చేయవచ్చని వారికి తెలిపారు. హెచ్చరికలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే వైమానిక దాడులు ప్రారంభమయ్యాయి. గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతుగా హౌతీలు ఇజ్రాయెల్ పై మిస్సైల్ దాడులకు దిగారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ హౌతీ స్థావరాలపై గురిపెట్టింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఈ దాడులను ధ్రువీకరించారు. రక్షణ మంత్రి హెచ్చరిస్తూ.. "హౌతీలు ఏ చర్య తీసుకున్నా.. దానికి వారు మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. యెమెన్కు కూడా ఇరాన్కు పట్టిన గతే పడుతుంది. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా చేయి ఎత్తిన వారి చేతులు నరికేయబడతాయి." అని ఆయన హెచ్చరించారు.

ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేసింది?
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ దాడికి కారణాన్ని వెల్లడించింది. ఇజ్రాయెల్ పౌరులు, దాని మిత్రదేశాలపై ఉగ్రవాద కుట్రలను అమలు చేయడానికి హౌతీ తిరుగుబాటుదారులు ఇరాన్ నుంటి ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నారని ఐడీఎఫ్ పేర్కొంది. ఈ దాడిలో ఇబ్, తైజ్ నగరాలకు విద్యుత్ సరఫరా చేసే హౌతీ నియంత్రిత విద్యుత్ కేంద్రం 'రాస్ కనాటిబ్'ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. 2023లో హౌతీలు స్వాధీనం చేసుకున్న "గెలాక్సీ లీడర్" ఓడను ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. గెలాక్సీ లీడర్ ఓడను హౌతీలు అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో నౌకలను గమనించడానికి రాడార్ సిస్టమ్గా ఉపయోగిస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.
హౌతీ తిరుగుబాటుదారులు ఏమన్నారంటే?
హౌతీ తిరుగుబాటుదారులకు సంబంధించిన మీడియా ఈ దాడిని ధ్రువీకరించింది. అయితే వారు కేవలం హుదైదా పోర్టుపై జరిగిన దాడిని మాత్రమే అంగీకరించారు. దాడి వల్ల జరిగిన నష్టం లేదా మరణాల గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇజ్రాయెల్ దాడి తర్వాత తమ వాయు రక్షణ వ్యవస్థలు చురుకుగా మారాయని, క్షిపణులతో దాడులకు ప్రతిస్పందించామని హౌతీ తిరుగుబాటుదారులు పేర్కొన్నారు.
ఇజ్రాయెల్-హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఎందుకు శత్రుత్వం?
ఇజ్రాయెల్-హమాస్ సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి, హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్పై నిరంతరం క్షిపణులను ప్రయోగిస్తున్నారు. అంతేకాకుండా, వారు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్, పశ్చిమ దేశాలకు చెందిన నౌకలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ నుంచి మద్దతు లభిస్తుంది. గత నెలలో కూడా ఇజ్రాయెల్ నావికాదళం హుదైదాలోని అనేక సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది.
-
ఇజ్రాయెల్ చేసింది తప్పే..! తొలిసారి అంగీకరించిన ట్రంప్..! -
" ఆ 22 భారత్ నౌకలు సేఫ్.. హార్మూజ్ వద్ద.." -
ఆయిర్ రిఫైనరీలపై దాడులు.. తక్షణమే ఆపాలి: భారత్ -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్












Click it and Unblock the Notifications