ఇది ఆరంభం మాత్రమే.. కరోనాపై అమెరికన్ నిపుణుడి సంచలనం.. అదొక్కటే మార్గం...
ఎబోలా,హెచ్ఐవి వైరస్లతో పోలిస్తే కరోనా వైరస్ మరింత ప్రమాదకరమని.. తన కెరీర్లో తనను అత్యంత భీతిగొల్పిన వైరస్ ఇదేనని అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ&ఇన్ఫెక్షియస్ డిసీజ్(NIAID) చీఫ్ డా.ఆంటోని ఫౌసీ అభిప్రాయపడ్డారు. కేవలం నాలుగు నెలల కాలంలో కరోనా వైరస్ ప్రపంచాన్ని నాశనం చేసిందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనాపై పోరుకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్లోనూ ఫౌసీ సభ్యుడిగా ఉన్నారు. తాజాగా బయో డిజిటల్ వర్చువల్ హెల్త్ కాన్ఫరెన్స్కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫౌసీ కరోనా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Recommended Video

వాటి కంటే చాలా సంక్లిష్టమైనది..
1918లో వ్యాప్తి చెందిన ఫ్లూ కంటే కరోనా వైరస్ చాలా ప్రమాదకరమని ఫౌసీ పేర్కొన్నారు.హెచ్ఐవి,ఎబోలా వైరస్ల కంటే కరోనా వైరస్ మరింత సంక్లిష్టమైనదని తెలిపారు. ఎబోలా ప్రాణాంతకమైన వైరసే అయినప్పటికీ.. ఇంత సులువుగా అది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే రకం కాదన్నారు. చాలావరకు అంటువ్యాధులు స్థానికంగానే ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని.. కానీ కరోనా అందుకు భిన్నంగా ఉందని చెప్పారు. గతంలో, ప్రపంచం కనీసం కొన్ని లక్షణాలను కలిగి ఉన్న వైరస్ వ్యాప్తిని చూసింది కానీ COVID-19 లో ఆ లక్షణాలన్నీ కలిపి ఉన్నాయని పేర్కొన్నారు.

ఇది ఆరంభం మాత్రమే..
'ఈ వైరస్ ఎక్కడ అంతమవుతుందో.. ఇప్పటికైతే వైరస్ను అర్థం చేసుకోవడంలో మనం ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాం. అని ఫౌసీ పేర్కొన్నారు. కాబట్టి కరోనాపై సుదీర్ఘ కాలం పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. 'ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్స్ అవసరం ఉంటుంది.. కాబట్టి బిలియన్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే.. వ్యాక్సిన్ రంగంలో ఒకరి కంటే ఎక్కువ విన్నర్స్ అవసరం ఉంటుంది.' అని చెప్పుకొచ్చారు.

చరిత్రలో కనివినీ ఎరగని వైరస్..
ఒకవేళ కరోనా వైరస్కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే... దాని ధరపై కూడా నియంత్రణ అవసరమన్నారు ఫౌసీ. కరోనా వైరస్ సోకిన పేషెంట్కి అసలేం జరుగుతుంది.. తిరిగి కోలుకుంటాడా.. దీర్ఘకాలంలో ఈ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఉండే ఎఫెక్ట్స్ ఏంటి..? విషయాలను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. చరిత్రలో ఇప్పటివరకూ ఇలాంటి పరిస్థితిని భూమండలం ఎప్పుడూ ఎదుర్కొలేదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 200 పైచిలుకు దేశాలు షట్ డౌన్లో ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

ఆ కమ్యూనిటీలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్న ఫౌసీ..
కోవిడ్-19 అమెరికా హెల్త్ కేర్ వ్యవస్థలో లోపాలను బయటపెట్టిందన్నారు. ప్రజారోగ్య సంక్షోభం నుంచి బయటపడగానే ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాతో ఎక్కువ ఎఫెక్ట్ అయిన ఆఫ్రికన్ అమెరికన్ కమ్యూనిటీలపై కూడా ఫోకస్ పెట్టాలన్నారు. కంప్యూటర్ ముందు కూర్చొని టెలీ వర్క్ చేసే ఉద్యోగాల కంటే,ఇతరత్రా ఉద్యోగాల్లోనే వారు ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. మీరు కేవలం ఇంటరాక్ట్ అయ్యే చోట.. వారు శారీరకంగా చాలా కష్టపడుతున్నారని చెప్పారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications