రష్యా విదేశాంగ మంత్రి జై శంకర్ భేటీ, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపైనే ప్రధాన చర్చ..
సరిహద్దుల్లో డ్రాగన్ చైనా దుందుకుడు చర్యలపై భారత్ ఆగ్రహాంతో ఉంది. ఆ దేశ వైఖరిని ఎండగడుతూనే ఉంది. బుధవారం విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రొవ్తో సమావేశమయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిల బలోపేతంపై చర్చించారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరినామాలపై ఇద్దరు డిస్కష్ జరిగింది. షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు నాలుగురోజుల పర్యటన నిమిత్తం జై శంకర్ రష్యా వెళ్లిన సంగతి తెలిసిందే.

Recommended Video
ఇరుదేశాల వ్యుహాత్మక భాగస్వామ్యం పెంపొందించేందుకు చర్చలు సహృద్భావ వాతావరణంలో జరిగాయని తెలిపారు. దేశ రక్షణ, భద్రతా అవసరాలకు పెద్దపీట వేశారు. రష్యా తమతో వ్యుహాత్మక భాగస్వామ్యం మరింత పెంపొందించడానికి అంగీకరించిందని జై శంకర్ తెలిపారు. వారం కింద ఎస్ సీ వో సదస్సులో రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరైన సంగతి తెలిసిందే. డ్రాగన్ చర్యలను గట్టిగా ఎండగట్టారు. చైనా దూకుడుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఆ తర్వాత జై శంకర్.. చైనా విదేశాంగ మంత్రితో సమావేశం అయ్యారు. తర్వాత బుధవారం రష్యా విదేశాంగ మంత్రిని కలిసి.. వివిధ అంశాలను చర్చించారు.












Click it and Unblock the Notifications