గ్రేవ్ డేంజర్..: కరోనా విధ్వంసం సృష్టిస్తోన్న వేళ జపాన్ ప్రధాని సంచలన నిర్ణయం:
టోక్యో: రోజులు గడుస్తున్న కొద్దీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తూనే వస్తోంది. ప్రపంచ పటంలోని అన్ని దేశాలనూ కరోనా వైరస్ కమ్మేసింది. 13 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడి అనారోగ్యానికి గురయ్యారు. 74 వేల మందికి పైగా మరణించారు. ఆఫ్రికాలోని కొన్ని చిన్న దేశాలను మినహాయిస్తే. ప్రపంచం నలుమూలలా విస్తరించింది ఈ వైరస్. దీన్ని నియంత్రించడానికి భారత్ సహా అన్ని దేశాలు కూడా కఠిన నిర్ణయాలను తీసుకుంటున్నాయి. భారత్ సహా చాలా దేశాల్లో లాక్డౌన్ అమల్లో ఉంటోంది.

స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధింపు..
ఈ పరిస్థితుల్లో జపాన్ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటిదాకా అలాంటి నిర్ణయాన్ని తీసుకున్న తొలి దేశం అదే. రాజధాని టోక్యో సహా ఏడు నగరాల్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించింది జపాన్ ప్రభుత్వం. టోక్యో, ఒసాకా, క్యోటో వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఎమర్జెన్సీ సందర్భంగా కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని జపాన్ ప్రధానమంత్రి షింజో అబే వెల్లడించారు. కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఇంతకు మించిన మరో మార్గం లేదని అన్నారు. రాజధానిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రైళ్లు.. సూపర్ మార్కెట్లకు ఢోకా ఉండదంటూ..
అత్యవసర పరిస్థితిని విధించినప్పటికీ.. ఆయా రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఉండబోదని షింజో వెల్లడించారు. బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు తిరగడంపై ఆంక్షలను విధించినట్లు చెప్పారు. నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు ఆటంకం కలగకుండా ఉండటానికి ఆయా నగరాల్లోని సూపర్ మార్కెట్లన్నీ తెరిచే ఉంచుతామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ పరిపాలన, ఇతర వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించాల్సిన బాధ్యతను ఆయా రాష్ట్రాల గవర్నర్లకు అప్పగించినట్లు తెలిపారు.

ఇదివరకే ఎమర్జెన్సీ సంకేతాన్ని ఇచ్చిన షింజో సర్కార్
కరోనా వైరస్ విజృంభణ ఆరంభమైన తొలి రోజుల్లోనే జపాన్ ప్రభుత్వం తమ దేశ చట్టాల్లో కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు, చేపట్టాల్సిన చర్యల గురించి ఈ చట్టాల్లో పొందుపరిచారు. ఈ అత్యవసర పరిస్థితిని గ్రేవ్ డేంజర్గా ప్రకటించింది జపాన్ ప్రభుత్వం. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ పదాన్ని విస్తృతంగా వినియోగిస్తోంది.

ప్రజాభిప్రాయాన్ని సేకరించిన తరువాతే..
అత్యవసర పరిస్థితిని విధించడానికి ముందు ప్రజాభిప్రాయాన్ని సేకరించింది షింజో అబే ప్రభుత్వం. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో 80 మంది స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీకి అనుకూలంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. 12 శాతం మంది అత్యవసర పరిస్థితి అవసరం లేదని తెలిపారు. కరోనా వైరస్ విస్తరించడం మొదలైన తరువాత దేశంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయని, ఆ తరువాత కూడా అవి కొనసాగే ప్రమాదం లేకపోలేదని షింజో అబే చెప్పుకొచ్చారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications