ఎంబసీ జోన్లో ఆత్మాహుతి దాడి...13 మంది దుర్మరణం
అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన కాబూల్ దౌత్యకార్యాలయ జోన్ సమీపంలో మంగళవారం ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ పేలుడులో 13 మంది మృతిచెందగా, మరో 13 మంది వరకు గాయపడ్డారు.
కాబూల్: అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన కాబూల్ దౌత్యకార్యాలయ జోన్ సమీపంలో మంగళవారం ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. పేలుడు ధాటికి ఆ సమీపంలోని కార్యాలయాల తలుపులు, అద్దాలు పగిలిపోయాయి.
వివిధ రాయబార కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే ఉండటంతో ఒక్కసారిగా భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. ఈ పేలుడులో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది వరకు గాయపడినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఆస్ట్రేలియా ఎంబసీకి సమీపంలో ఉన్న కాబూల్ గ్రీన్ జోన్లో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పోలీసుల వాహనాలు, అంబులెన్స్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు ప్రారంభించాయి.
బుధవారం అందరూ బిజీగా ఉన్న సమయంలో ఈ ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. క్షతగాత్రులను హుటాహుటిన సిటీ ఆసుపత్రులకు తరలించినట్టు ప్రజారోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఈ ఉగ్రదాడికి.. తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్లు ప్రకటించారు. అయితే ఆఫ్ఘానిస్తాన్ నిఘా సంస్థ అధికారులు మాత్రం ఈ ఉగ్రదాడి.. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదుల పనిగా భావిస్తున్నారు. వీరికి తాలిబన్లు సహకరించి ఉంటారని అనుమానిస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications