వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం: యువతి ప్రాణం తీసిన సెల్పీ సరదా

|
Google Oneindia TeluguNews

లండన్: ఇటీవలి కాలంలో సెల్ఫీలు సరదా పెరిగిపోయింది. అయితే ఆ సరదా సాహసంగా మారి ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా సెల్ఫీ కోసం సాహసం చేసిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. రుమేనియాకు చెందిన ఓ యువతి సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో రైలు పైకి ఎక్కడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృత్యువాత పడింది.

అన్నా ఉర్సు (18) అనే యువతి రైలు పైన నిలబడి సెల్ఫీ తీసుకోవాలని సరదా పడింది. ఆ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయాలని భావించింది. అనుకున్న తడవుగా అన్నా తన స్నేహితురాలితో కలసి లాసి పట్టణంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. ఇద్దరూ కలసి రైలుపైకి ఎక్కారు.

London: Teenager dies while trying to click a selfie on train's roof

ఈ క్రమంలో అన్నా ఉర్సు హై టెన్షన్ విద్యుత్ తీగలకు దగ్గరగా వెళ్లడంతో షాక్ తగిలింది. ఆమె దుస్తులకు మంటలు అంటుకోగా, మరో స్నేహితురాలి రైలుపై నుంచి పడిపోయింది. ఈ సంఘటనను గమనించిన ఓ ప్రయాణికుడు వెంటనే ఎమర్జెన్సీ సర్వీసుకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.

ప్రాణాలకు తెగించి వీరిని కాపాడేందుకు ప్రయత్నించాడు. రైలుపైకి ఎక్కి ఆమె దుస్తులపై మంటలను ఆర్పివేశాడు. ఇద్దరు అమ్మాయిలను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉర్సు శరీరం 50 శాతంపైగా కాలిపోయి తీవ్రగాయాలు కావడంతో మరణించింది. ఆమె స్నేహితురాలి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది.

English summary
If you love taking selfies, be cautioned: It can also be fatal. A selfie-obsessed Romanian teenager got electrocuted and burst into flames while trying to click a selfie atop the roof of a train.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X