కరోనా సమూల నియంత్రణ ఇప్పట్లో లేనట్టే.. డబ్ల్యుహెచ్వో కీలక ప్రకటన
కరోనా వైరస్ ఆవిర్భావమే సరిగా తెలియలేదు. వ్యాక్సిన్ వచ్చినా.. ఏదో అలా తీసుకుంటున్నారు. కానీ ఇప్పటికీ గందరగోళం ఉంది. దీనికి ఊతమిచ్చే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మాట్లాడుతోంది. మహమ్మారి అంతానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు.
పటిష్ఠమైన వైద్యారోగ్య చర్యల ద్వారా కొన్ని నెలల వ్యవధిలో దీన్ని నియంత్రించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి రెండు నెలల గణాంకాలు చూస్తే... మరణాలు, కొత్త కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. దీంతో వైరస్ను నియంత్రించగలమని.. వేరియంట్లను అడ్డుకోగలమన్న విషయం స్పష్టమైందన్నారు.

గత ఏడు వారాలుగా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని టెడ్రోస్ తెలిపారు. ప్రస్తుతం కీలక దశలో ఉన్నామని పేర్కొన్నారు. గత వారంలో కేసుల సంఖ్యలో 9 శాతం.. మరణాల్లో 5 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. కొన్ని దేశాల్లో కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. ఇంకా నైట్ క్లబ్లు, రెస్టారెంట్లు, మార్కెట్లు జనాలతో కిటకిటలాడుతున్నాయని తెలిపారు. ఇక కొంతమంది తాము యువకులం కాబట్టి కరోనా సోకినా ఏమీ కాదన్న ధోరణితో వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications