మర్చిపోలేను: పాక్లో పర్యటిస్తూ మలాలా కంటతడి
ఇస్లామాబాద్: కొన్నేళ్ల తర్వాత స్వదేశానికి రావడం చాలా ఆనందంగా ఉందని నోబెల్ శాంతి పురస్కార గ్రహిత మలాలా యూసఫ్జాయ్ అన్నారు. తనపై దాడి జరిగిన తర్వాత తొలిసారి గురువారం పాకిస్థాన్ పర్యటనకు వచ్చారు మలాలా. ఆమెకు పాకిస్థాన్లో ఘనస్వాగతం లభించింది.
రాజధాని ఇస్లామాబాద్లో ప్రధాని షాహిద్ అబ్బాసీతో మలాలా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అబ్బాసీ మాట్లాడుతూ.. 12 ఏళ్ల వయస్సులో దేశాన్ని వీడి, ఇప్పుడు ప్రముఖ వ్యక్తిగా మలాలా స్వదేశానికి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

ప్రధానిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మలాలా.. 'ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేనిది. ఇప్పటికి నేను దీన్ని నమ్మలేకపోతున్నాను' అని కంటతడి పెట్టారు. సాధారణంగా తాను ఏడవనని, వయస్సులో చిన్నదాన్నే అయినా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్టు చెప్పారు.
ప్రస్తుత సమాజంలో బాలికల విద్య ఆవశ్యకత, మలాలా పౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాల గురించి ఆమె ప్రస్తావించారు. పాకిస్థాన్లోని బాలికలందరూ విద్యను అభ్యసించాలని అన్నారు. ఇందుకోసం తాను కృషి చేస్తానని చెప్పారు. 2012లో తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడిన మలాలాను పాక్ ప్రభుత్వం మెరుగైన వైద్యం కోసం బ్రిటన్కు పంపింది. చికిత్స పొందిన మలాలా.. అప్పట్నుంచి లండన్లోనే ఉంటున్నారు.
-
పెట్రోల్ పై రూ. 80 తగ్గింపు: బస్సు ప్రయాణం పూర్తిగా ఉచితం -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications