పిల్లలను అమ్మేశాడు: ఉరి తీశారు
చైనా: శిశువులను కొనుగోలు చేసి మరో ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసిన వ్యక్తిని చైనాలో ఉరి తీశారు. చైనాకు చెందిన టాన్ యాంగ్జీ (69) అనే వ్యక్తిని శుక్రవారం సెంట్రల్ చైనాలోని హెనన్ ప్రావిన్స్ లో ఉరి తీశామని సుప్రీం పీపుల్స్ కోర్టు (ఎస్ పీసీ) వెల్లడించింది.
2008 నుంచి 2013వరకు టాన్ యాంగ్లీ మరో ఇద్దరితో కలిసి నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్ ప్రాంతంలో పిల్లలను కొనుగోలు చేశాడు. తరువాత హెనన్ ప్రావిన్స్ ప్రాంతానికి తీసుకు వెళ్లి అక్కడ వేరే వ్యక్తులకు అమ్మేశాడు.

ఇలా మొత్తం 22 మంది పిల్లలను అమ్మేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు. 2014లో కోర్టు ఇతనికి ఉరి శిక్ష అమలు చేసింది. అయితే తాను పిల్లలు లేని వారిని పిల్లలను అప్పగించానని, వారికి న్యాయం చేశానని కోర్టులో సమర్థించుకున్నాడు.
అయితే మగ పిల్లలను 30,000 యువాన్లకు, ఆడ పిల్లలను 16,000 యువాన్లకు కొనుగోలు చేశాడని, ఒక్కోక్కరి మీద మూడు వేల యువాన్ల లాభం తీసుకుని విక్రయించాడని పోలీసు అధికారులు సాక్ష్యాలు సంపాధించి కోర్టులో సమర్పించడంతో ఉరి శిక్ష అమలు చేశారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications