జుకర్బర్గ్ను వెంటాడుతున్న దరిద్రం.. చిక్కుల్లో మెటా!
టెక్ ప్రపంచంలో గొప్ప పేరు సంపాదించిన మెటా సంస్థ ఇప్పుడు చరిత్రలోనే అతిపెద్ద యాంటీ ట్రస్ట్ విచారణను ఎదుర్కొంటోంది. సీఈఓ మార్క్ జుకర్బర్గ్పై అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) సోమవారం నుంచి విచారణ ప్రారంభించింది. సామాజిక మాధ్యమాల్లో గుత్తాధిపత్యం నెలకొల్పేందుకు మెటా తీసుకున్న వ్యూహాలు ఎంతవరకు చట్టబద్ధమైనవో విచారణలో తేలనుంది.
"పోటీ చేయడం కన్నా, వాటిని కొనేయడం మేలు"
మెటా కంపెనీ పోటీని తొలగించేందుకు, 2012లో ఇన్స్టాగ్రామ్, 2014లో వాట్సాప్ను కొనుగోలు చేసిందని FTC ఆరోపణలు చేసింది. "పోటీ చేయడం కన్నా, వాటిని కొనేయడం మేలు" అనే 2008లో మార్క్ జుకర్బర్గ్ రాసిన ఇంటర్నల్ ఇమెయిల్స్ను సాక్షిగా చూపిస్తోంది. ఇవి కంపెనీ వ్యూహాన్ని పటిష్టంగా రుజువు చేస్తున్నాయని FTC అభిప్రాయపడుతోంది.

ఈ సందర్భంగా FTC తరపు న్యాయవాదులు, మెటా విస్తరణ ప్రణాళికను "పోటీని చుట్టేస్తూ" సాగినదిగా అభివర్ణిస్తున్నారు. మొబైల్ యాప్ల విస్తరణ దశలో, తక్కువ మార్కెట్ షేర్ ఉన్న కంపెనీలను లక్ష్యంగా చేసుకొని, వాటిని మింగేసే విధంగా మెటా వ్యవహరించిందని పేర్కొన్నారు..
జుకర్ బర్గ్ వాదన ఇలా
కానీ జుకర్బర్గ్ మాత్రం తన నిర్ణయాలను న్యాయబద్ధంగా సమర్థించుకుంటున్నారు. "ఆ మెయిల్స్ చర్చలు ప్రారంభమైన దశలో ఉన్నవే. పూర్తిస్థాయి వ్యూహాన్ని అవి ప్రతిబింబించవు," అని ఆయన అన్నారు. "ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లను మెటా ఎంతగా అభివృద్ధి చేసిందో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. అభివృద్ధి చేయకపోతే అవి ఈ స్థాయికి వచ్చేవే కావు," అని స్పష్టం చేశారు.
అలాగే మెటా న్యాయవాదులు కూడా FTC కేసును తీవ్రంగా వ్యతిరేకించారు. "ఒప్పందాలు దశాబ్దాల క్రితమే ముగిశాయి. ఇప్పుడు ఆ విషయంలో విచారణ అనవసరం," అని వాదించారు. మెటా పెట్టుబడులే ఈ యాప్లను ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందేలా చేశాయని తెలిపారు.
మెటాకు వ్యతిరేకంగా తీర్పు వెలువరిస్తే..
కోర్టు మెటాకు వ్యతిరేకంగా తీర్పు వెలువరిస్తే మాత్రం.. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ను వేరుగా విక్రయించాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది మెటాకు పెద్ద ఆర్థిక దెబ్బే అవుతుంది. 2025 నాటికి మెటా సంస్థ తమ ఆదాయంలో సగం పైగా ఇన్స్టాగ్రామ్ నుంచే వస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
అటు రాజకీయ కోణంలోనూ కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. గతంలో డొనాల్డ్ ట్రంప్, జుకర్బర్గ్ల మధ్య సంబంధాలు అంతగా ఉండేవి కాదు. కానీ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చాక కొన్ని మార్పులు జరిగాయి. ఇటీవల జుకర్బర్గ్ ట్రంప్కు చెందిన ఒక ఫండ్కు 10 లక్షల డాలర్ల విరాళం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ, FTC విచారణలో మాత్రం ఎలాంటి సడలింపు లేనట్టు కనిపిస్తోంది.
ఈ విచారణ టెక్ ఇండస్ట్రీలో శాశ్వత ప్రభావం చూపించనుందని, తద్వారా పెద్ద టెక్ కంపెనీల వ్యాపార నమూనాలు, పోటీ విధానాలపై ప్రభుత్వాల దృష్టి మరింత పదునుగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications