వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీజీ.. 385 రోజులైంది -ఇకనైనా ఈవెంట్స్‌‌ పక్కనపెట్టి, వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టండి: రాహుల్ గాంధీ

|
Google Oneindia TeluguNews

దేశంలో కొవిడ్ వైరస్ రెండోదశ వ్యాప్తి అత్యంత ప్రమాదకరంగా కొనసాగుతోంది. కొత్త కేసులు, భారీ సంఖ్యలో మరణాలతో గత రికార్డులన్నీ చెరిగిపోతున్నాయి. కేంద్రం ఎంతో ఉత్సాహంగా టీకా ఉత్సవం ప్రకటించినప్పటికీ, చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్లు నిండుకున్నాయి. కాగా, విలయ కాలంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రధాని మోదీ బొత్తిగా బాధ్యత మరిచి పొలిటికల్ ఈవెంట్లతో కాలక్షేపం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.

సిగ్గుందా.. వాలంటీర్లు జగన్ సైన్యాలా? -షర్మిల పార్టీకి విజయమ్మ అధ్యక్షురాలా? -వైసీపీ ఎంపీ రఘురామ ఫైర్సిగ్గుందా.. వాలంటీర్లు జగన్ సైన్యాలా? -షర్మిల పార్టీకి విజయమ్మ అధ్యక్షురాలా? -వైసీపీ ఎంపీ రఘురామ ఫైర్

దేశంలో కరోనా డేంజర్ బెల్స్, కేంద్రం అలసత్వ వైఖరిని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈవెంట్స్ నిర్వహించడం మానేసి, అందరికీ వ్యాక్సిన్ అందేలా చూడాలంటూ రాహుల్ చురకలంటించారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తోందని, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని కోరారు.

Modi Ji, Stop This Eventbaazi, Vaccinate All Who Need It, says Rahul Gandhi

ప్రస్తుతం దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, దీనిని దృష్టిలో పెట్టుకునే పేద ప్రజలకు కేంద్రం సాయం చేయాలని మోదీని రాహుల్ కోరారు. 18 రోజుల్లో కరోనాపై విజయం సాధిస్తామని మోదీ గతంలో ప్రకటన చేశారని, ఇప్పటికి 385 రోజులు పూర్తయినా, వైరస్ కట్టడి దిశగా మోదీ ఒక్క అడుగైనా వేయలేదని కాంగ్రెస్ నేత మండిపడ్డారు.

Fact Check: వాట్సాప్ ద్వారా కొవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ నిజమేనా? కేంద్రం షాకింగ్ వివరణFact Check: వాట్సాప్ ద్వారా కొవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ నిజమేనా? కేంద్రం షాకింగ్ వివరణ

''గంటలు మోగించారు. ప్లేట్లు మోగించారు. ఫోన్ టార్చ్‌లను వెలిగించారు. అయినా కరోనా వేవ్ సాగుతోంది. ప్రస్తుతం సెకండ్ వేవ్ కొనసాగుతోంది. లక్షల మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈవెంట్స్‌పై దృష్టి మానేసి, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించండి. విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతలను ఆపేయండి. పేదలకు వీలైనంత సహాయం అందించండి'' అని రాహుల్ గాంధీ సూచించారు.

English summary
Congress leader Rahul Gandhi today asked Prime Minister Narendra Modi to "stop holding events" and, instead, take steps to vaccinate everyone in the wake of the ferocious second wave of the Covid-19 pandemic sweeping the country. He also sought financial help for the poor to tide over the prevailing economic conditions. In a video message posted on Twitter today, he reminded the Prime Minister of his promise to win the battle against the pandemic in 18 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X