భారత్ పై ఆంక్షలకు నాటో హెచ్చరిక..! రీజన్ ఇదే..!
అంతర్జాతీయంగా వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు భారత్ కు సవాల్ విసురుతున్నాయి. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరిగినా, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం జరిగినా, భారత్-పాక్ యుద్దం జరిగినా మన పాత్రపై చర్చ జరుగుతూనే ఉంది. అయితే అంతర్జాతీయ వ్యవహారాల్లో తటస్థంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొన్ని కీలక అంశాల్లో మాత్రం కొన్ని దేశాలకు టార్గెట్ కాక తప్పడం లేదు. ఇదే క్రమంలో తాజాగా భారత్ పై ఆంక్షలు విధిస్తామని అమెరికా, దాని మిత్రదేశాలతో కూడిన నాటో కూటమి హెచ్చరికలు జారీ చేసింది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంత సుదీర్ఘంగా సాగడానికి కారణమైన పశ్చిమ దేశాలతో కూడిన నాటో కూటమిలో ఇప్పుడు అసహనం పెరుగుతోంది. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు మద్దతిస్తున్న ఈ కూటమి ఈ యుద్దంలో భారీ ఎత్తున ఆయుధాలు, డబ్బు, ఇతర సాయం అందిస్తోంది. దీంతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి అంతు లేకుండా పోతోంది. ఇదే క్రమంలో రష్యాపై ఉక్రెయిన్ పైచేయి సాధించకుండా అడ్డుపడుతున్న దేశాలను నాటో టార్గెట్ చేస్తోంది.

ఇందులో భాగంగా రష్యా నుంచి చమురు కొంటూ ఆ దేశానికి కీలక సాయం అందిస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ దేశాలపై ఆంక్షలు విధిస్తామని నాటో కూటమి ఇప్పుడు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రష్యాతో నిరంతర వ్యాపారం చేస్తున్న ఈ మూడు దేశాలపై ద్వితీయ స్థాయి ఆంక్షలు విధిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే హెచ్చరించారు. అమెరికా కాంగ్రెస్ లో సెనేటర్లతో మాట్లాడిన ఆయన.. ఈ మూడు దేశాలకు రష్యాను ఉక్రెయిన్ తో శాంతి ఒప్పందానికి ఒప్పించాలని సూచించారు.

రష్యాకు అండగా నిలుస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ ఇప్పుడు తాము చెప్పినట్లు శాంతి ఒప్పందానికి పుతిన్ ను ఒప్పించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడక తప్పదని నాటో సెక్రటరీ జనరల్ హెచ్చరించారు. ఇప్పటికే నాటో కూటమిలో ప్రధానమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఉక్రెయిన్ కు భారీగా ఆయుధ సాయం చేస్తామని, అలాగే రష్యాకు సహకరించే వారిపై 100శాతం పన్నులు విధిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు నాటో చేసిన హెచ్చరికలతో రష్యాతో ఒప్పందాల్ని ఆయా దేశాలు పునరాలోచించుకుంటాయని ట్రంప్ కూడా భావిస్తున్నారు.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications