నేపాల్ ప్రధాని రాజీనామా
Nepal: నేపాల్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఆ దేశంలో హింసాత్మక నిరసనలు, తీవ్రమవుతున్న రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. సైన్యం సూచనతో రాజీనామా చేస్తున్నట్లు కేపీ శర్మ ఓలీ ప్రకటించారు. ఆయన నేపాల్ నుంచే దుబాయ్ వెళ్లే అవకాశం ఉంది. దీంతో సైన్యం కొత్త ప్రధాని పేరును ప్రకటించే అవకాశం ఉంది. సోమవారం ప్రారంభమైన హింసాత్మక ప్రదర్శనల్లో 20 మందికి పైగా మరణించగా.. వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటనలతో ప్రభుత్వం పూర్తిగా ఇరుకున పడింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సైన్యాన్ని మోహరించినప్పటికీ.. Gen-Z యువతరం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు ఓలీ ప్రభుత్వాన్ని రాజీనామా చేసేలా చేశాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాజీనామాకు ముందు సైనిక దళాల అధిపతి అశోక్ రాజ్ సిగ్దెల్ ఓలీకి పదవి నుంచి తప్పుకోవాలని సలహా ఇచ్చారు. అంతకుముందే కేబినెట్లోని పలువురు మంత్రులు, హోం మంత్రి రమేష్ లేఖక్, ఆరోగ్య మంత్రి ప్రదీప్ పౌడెల్ వంటి వారు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. దీంతో కేపీ శర్మ ఓలీ రాజకీయంగా ఒంటరి అయ్యారు.

దేశం విడిచి పారిపోయిన అనేక మంది నేతలు
నేపాల్లో పరిస్థితులు దారుణంగా మారడంతో అనేక మంది నేతలు దేశం విడిచి పారిపోతున్నారు. ఈ నేతలు భారత్, థాయ్ లాండ్, యూఏఈ వంటి దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారని సమాచారం. మాజీ ప్రధాన మంత్రి, నేపాలీ కాంగ్రెస్ నాయకుడు షేర్ బహదూర్ దేవూబా కూడా రహస్యంగా థాయ్లాండ్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయనకు థాయ్లాండ్లో వైద్య చికిత్స అవసరం ఉన్నట్లుగా సమాచారం.
సరిహద్దుల్లో భారత సైన్యం అప్రమత్తం
నేపాల్లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో బలగాలను పెంచారు. ఈ హింసాకాండ భారత సరిహద్దు ప్రాంతాలకు విస్తరించకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నేపాల్లో శాంతి నెలకొల్పేందుకు భారత్ పూర్తి సహాయం అందిస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది.
నేపాల్ పార్లమెంట్ భవనానికి నిప్పు
నిరసనకారులు నేపాల్ పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు. పార్లమెంట్లోపల కూడా భారీగా ధ్వంసం జరిగింది. పార్లమెంట్ భవనంతో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు కూడా ధ్వంసం అయినట్లు సమాచారం. ఈ చర్యతో ప్రజల్లో నెలకొన్న తీవ్ర ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది.
ఆర్థికంగా కుప్పకూలిన దేశం
హింసాకాండతో పాటు, నేపాల్ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర సంక్షోభంలో ఉంది. దేశంలో సరైన ప్రభుత్వ పాలన లేకపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పర్యాటకం, వాణిజ్యం పూర్తిగా కుప్పకూలాయి. విదేశాల నుంచి పెట్టుబడులు రావడం ఆగిపోయాయి. యువత ఉద్యోగాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణాలన్నీ కలిసి హింసాకాండకు దారితీశాయని విశ్లేషకులు చెబుతున్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications