ఘోరం: నైజీరియాలో ఆత్మాహుతి దాడి.. 50మంది మృతి
మంగళవారం ఉదయం ఈశాన్య అదమవాలోని మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ టీనేజర్ ఆత్మాహుతికి పాల్పడ్డాడు.
అబుజా: ఆత్మాహతి దాడితో నైజీరియా ఉలిక్కిపడింది. మంగళవారం ఉదయం ఈశాన్య అదమవాలోని మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ టీనేజర్ ఆత్మాహుతికి పాల్పడ్డాడు.
ఈ దాడిలో దాదాపు 50మంది దాకా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పదుల సంఖ్యలో జనం తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. పేలుడు పదార్థాలతో మసీదులోకి వచ్చిన యువకుడు తనకు తాను పేల్చేసుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

నైజీరియన్ ఉగ్రవాద సంస్థ బొకోహారమ్ ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇటీవలి కాలంలో టీనేజర్లను ఎక్కువగా ఆకర్షిస్తున్న బొకోహారమ్ వారిని ఉపయోగించుకుని ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరిస్తోంది.
ఆత్మాహుతి దాడి ఎవరి పనై ఉంటుందని పోలీస్ అధికారి అబూబకర్ ను మీడియా ప్రశ్నించగా.. 'ఇది ఎవరి పనో మనకందరికీ తెలుసు. ఎవరినో ప్రత్యేకంగా అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ దీని వెనుకాల ఎవరున్నారన్నది మనకి తెలిసిన విషయమే' అంటూ బదులిచ్చారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications