ఉగ్రవాదులపై మెరుపుదాడి: 61 మంది క్షేమం
అబుజా: బొకోహారమ్ ఉగ్రవాదులను ఉరికించిన నైజీరియా సైనం వారి చెరలో బందీలుగా ఉన్న 61 మందిని క్షేమంగా రక్షించారు. ఇదే సమయంలో నలుగురు బొకోహారమ్ ఉగ్రవాదులను అంతం చేశామని నైజీరియా సైనిక అధికారులు తెలిపారు.
బొకోహారమ్ ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి అయిన వారిలో ఎక్కువ మంది చిన్నపిల్లలు, మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. మొదట బొకోహారమ్ జీహాదిస్టులు ఉన్న ప్రాంతాలను నైజీరియా సైన్యం గుర్తించింది.
తరువాత యుద్ద విమానాల సహాయంతో బొకోహారమ్ ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాలలో సైన్యం దిగింది. ఉగ్రవాదుల చెరలో ఉన్న వారికి ఎలాంటి హాని జరకుండా జాగ్రత్త పడిన సైన్యం కాల్పులు జరిపింది.

ఉగ్రవాదులను అక్కడి నుంచి ఉరికించారు. తరువాత చెరలో ఉన్న వారిని క్షేమంగా రక్షించి యుద్ద విమానాలలో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదే సమయంలో నలుగురు ఉగ్రవాదులు అంతం అయ్యారని, మిగిలిన వారు పారిపోయారని అధికారులు తెలిపారు.
గత కొంత కాలంగా బొకోహారమ్ ఉగ్రవాదులను అంతం చెయ్యడానికి నైజీరియా ప్రభుత్వం శక్తివంచన లేకుండ పని చేస్తున్నది. గత అక్టోబర్ 28వ తేదిన ఉగ్రవాదుల చెరలో ఉన్న 330 మంది బందీలను క్షేమంగా రక్షించారు. బొకోహారమ్ ఉగ్రవాదులు ఎక్కువగా మహిళలు, చిన్నారులను కిడ్నాప్ చేస్తున్నారని అధికారులు తెలిపారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications