నేషనల్ డైలాగ్ క్వార్టెట్ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి
ఓస్లో: ట్యునీషియాకు చెందిన నేషనల్ డైలాగ్ క్వార్టెట్ సంస్థను 2015 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి వరించింది. బహుళ ప్రజాస్వామ్య నిర్మాణానికి కృషి చేసినందుకుగాను ఆ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు.
నార్వే పార్లమెంటు ఎంపిక చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ ఈ శాంతి బహుమతి విజేతను నిర్ణయించింది. ట్యూనీషియాలో 2011లో క్వార్టెట్ సంస్థ జాస్మిన్ రెవల్యూషన్ని చేపట్టింది. నిరుద్యోగం, ప్రభుత్వ లంచగొండితనం, సామాజిక అసమానతల నుంచి దేశాన్ని రక్షించేందుకు ఉద్యమాన్ని చేపట్టింది.
ఈ ఉద్యమం కారణంగా స్వేచ్ఛ, ప్రజాస్వామిక ఎన్నికలు జరిగాయి. కాగా, 273 మంది పోటీదారులను వెనక్కి నెట్టి క్వార్టెట్ సంస్థ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకుంది. జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కల్, పోప్ ఫ్రాన్సిస్ కూడా అవార్డు పోటీలో ఉండటం గమనార్హం.

కాగా, నిరుడు బాలల హక్కుల ఉద్యమకర్తగా భారతీయుడైన కైలాస్ సత్యార్థి, బాలికల విద్య కోసం పోరాడిన పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్జాయ్లకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి లభించిన సంగతి తెలిసిందే.
1901 నుంచి 2014 సంవత్సరం వరకు మొత్తం 95 నోబెల్ శాంతి బహుమతులను అందజేశారు. 128 మంది ఈ బహుమతులను అందుకున్నారు. రెండు శాంతి బహుమతులను ముగ్గురికి చొప్పున అందజేశారు. ఇప్పటివరకు 16మంది మహిళలు ఈ అవార్డును అందుకున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications