14నిమిషాలు చాలు.. అంతా తుడిచిపెట్టుకుపోవడమే!: గువామ్పై దాడికి ఉ.కొరియా ప్లాన్?
ఈ క్షిపణులు కేవలం 14 నిమిషాల్లోనే లక్ష్యాన్ని చేరుకుని అక్కడ విధ్వంసం సృష్టిస్తాయని తెలుస్తోంది.
వాషింగ్టన్: పరిస్థితులు చూస్తుంటే అమెరికాకు తమ సామర్థ్యమేంటో చూపించాలని ఉత్తరకొరియా ఉవ్విళ్లూరుతున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ దేశం అణు క్షిపణులను తయారుచేసిన సంగతి తెలిసిందే.
అమెరికా స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా క్షిపణి ప్రయోగం చేపట్టి పరోక్షంగా యుద్ద సంకేతాలు పంపించింది. ఆపై తరుచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. దీనికి అమెరికా ధీటుగా హెచ్చరించేసిరికి.. యుద్దానికి సమాయత్తమయ్యేలా అణ్వాయుధాలు సిద్దం చేసుకుంటోంది.
ఈ నేపథ్యంలోనే అమెరికా ఆధీనంలోని గువామ్ పై దాడి చేసేలా క్షిపణులను రూపొందించింది. తాజాగా తెలియవచ్చిన సమాచారం మేరకు.. ఈ క్షిపణులు కేవలం 14 నిమిషాల్లోనే లక్ష్యాన్ని చేరుకుని అక్కడ విధ్వంసం సృష్టిస్తాయని తెలుస్తోంది.

గువామ్ హోమ్ లాండ్ భద్రతా ప్రతినిధి జెన్నా ఈ వివరాలు వెల్లడించారు.ఉత్తరకొరియా చర్యలపై గువామ్ ప్రాంత ప్రజలను ఆయన అప్రమత్తం చేశారు. ఉత్తరకొరియా యుద్దానికి గనుక దిగితే ప్రజలంతా అప్రమత్తమయ్యేలా 15హెచ్చరిక వ్యవస్థల ద్వారా వారికి సంకేతాలు పంపిస్తామని అన్నారు. గువామ్ లోని అన్ని ప్రాంతాల్లో హెచ్చరిక వ్యవస్థలు ఉన్నాయని అన్నారు.
కాగా, గువామ్ ద్వీపంలో దాదాపు 7వేల మంది అమెరికా భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఉత్తరకొరియా చర్యలను పసిగట్టేందుకు వీరంతా అప్రమత్తమంగా ఉన్నట్లు సమాచారం.
-
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్












Click it and Unblock the Notifications