పాక్తో మా బంధం ఉక్కు కంటే గట్టిది, తేనే కంటే తియ్యనిది: చైనా
ఇస్లామాబాద్:పాకిస్థాన్తో తమ అనుబంధం స్టీల్ కంటే ధృడమైంది, తేనే కంటే తీయనిదని చెప్పారు చైనా వైస్ వైస్ ప్రీమియర్ వాంగ్ యాంగ్.
పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన సోమవారం నాడు పాల్గొన్నారు. కష్టకాలంలో ఒకరికోసం మరోకరు ఆపన్న హస్తాలు అందించుకొన్న విషయాన్ని ఆయన గుర్తుచేసుకొన్నారు. భవిష్యత్తులో కూడ తమ బంధం ఇలాగే కొనసాగుతోందన్నారు.

చైనా కేంద్ర పొలిట్బ్యూరో కమిటీలో సభ్యుడైన వాంగ్ చైనాలోని కమ్యూనిష్టు పార్టీకి చెందిన అగ్రనాయకుల్లో ఒకరు. రెండురోజుల పర్యటనకు కోసం ఆయన పాకిస్థాన్లో సోమవారం నాడు వచ్చారు. పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
అభివృద్దిలో చైనా పాకిస్థాన్కు సహయపడుతోందని చెప్పారు. వాంగ్తో పాటు చైనాకు చెందిన పలువురు అధికారులు కూడ పాకిస్థాన్లో పర్యటించారు. ఇదరుదేశాల మధ్య భారీ స్థాయిలో ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.












Click it and Unblock the Notifications