ఉగ్రవాదుల దుశ్చర్య: కాల్పుల్లో కెప్టెన్ సహా 11 మంది సైనికుల మృతి
పాకిస్తాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆ దేశ భద్రతా బలగాలపై విరుచుకుపడ్డారు. దీంతో కెప్టెన్ సహా 11 మంది చనిపోయారు. ఖైబర్ పంక్తువా ప్రావిన్స్లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో కొందరు పౌరులు ఉగ్రవాదులకు బందీలుగా ఉన్నారని తెలుస్తోంది. దాంతోనే దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఉగ్రవాద దాడిలో చనిపోయిన కెప్టెన్ అబ్దుల్ బాసిత్గా గుర్తించారు. 11 మంది చనిపోగా.. 15 మంది సైనికులు గాయపడ్డారు. కుర్రం ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ ప్రతీకార చర్యలకు దిగింది. బాసిత్.. పాకిస్తాన్ ఆర్మీ రెస్య్కూ మిషన్లో పనిచేస్తారని అక్కడి మీడియా తెలిపింది.
ఆరుగురు టెలీకాం విభాగానికి చెందిన సిబ్బందిని ఉగ్రవాదులు బందీ చేశారు. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాులు చనిపోయారు. ఘటనా స్థలంలో కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది.
దాడి జరిగిన ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో కెప్టెన్ బాసిత్ నేతృత్వంలోని బృందం గాలింపు చేపట్టిన నేపథ్యంలో టెర్రరిస్టులు సైనికులపై మెరుపుదాడి చేశారు. ఈ క్రమంలోనే ఆర్మీకి భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తుంది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications