గొంతు పట్టుకున్నాం, కార్గిల్ను భారత్ ఎప్పటికీ మరవదు: ముషారఫ్
కరాచీ: 1999లో కార్గిల్ యుద్ధాన్ని భారత దేశం ఎప్పటికీ మరిచిపోలేదని, ఆ సమయంలో తాము భారత్ గొంతును పట్టుకున్నామని పాకిస్తాన్ మాజీ మిలటరీ నియంత పర్వేజ్ ముషారఫ్ అన్నాడు. ఆయన ఆల్ పాకిస్తానీ ముస్లీం లీగ్ పార్టీ సమావేశంలో మాట్లాడారు.
భారత్కు తెలియకుండా కార్గిల్ ప్రాంతానికి నాలుగు వైపుల నుండి చేరుకున్నామని చెప్పారు. తద్వారా పాక్ ఆర్మీ భారత్ గొంతును పట్టుకుందన్నారు. ముందున్న సైన్యం వెనుక సెకండ్ లైన్ ఫోర్స్ కూడా సిద్ధంగా ఉందని.. ముషారఫ్ నాటి సంఘటనను గుర్తుకు చేసుకున్నాడు.

భారత్తో పోరాడుతున్న కొందరికి ఆర్మీ స్టేటస్ ఇచ్చినట్లు చెప్పాడు. పూర్తిస్థాయి ఆర్మీ పాల్గొనకుండానే యుద్ధం జరిగిందన్నాడు. పూర్తిస్థాయి ఆర్మీ పాల్గొంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. కాబట్టి కార్గిల్ యుద్ధంలో గెలుపు భారత్ది కాదని.. పాకిస్తాన్దేనని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
1971 నాటి యుద్ధం తర్వాత పాకిస్తాన్తో అతిపెద్ద యుద్ధం 1999లో కాశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ముషారఫ్ మాట్లాడారు. 1999లో కార్గిల్ యుద్ధం మాస్టర్ మైండ్ అయిన ముషారఫ్.. ఆ దేశాన్ని తొమ్మిదేళ్లకు పైగా పాలించాడు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications