పాకిస్తాన్ చేతికి న్యూక్లియర్ సబ్మెరైన్: ఆయుధ పోటీ
పాకిస్తాన్లోని కరాచీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చైనా న్యూక్లియర్ సబ్మెరైన్ పాక్కు చేరినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
కరాచీ: పాకిస్తాన్లోని కరాచీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చైనా న్యూక్లియర్ సబ్మెరైన్ పాక్కు చేరినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. నావికాదళం దీని పని తీరుపై అధ్యయనం చేస్తున్నారని సమాచారం.
న్యూక్లియర్ సబ్ మెరైన్లోకి సమీప దేశ సైనిక సిబ్బందిని అనుమతించడం సామాన్యమైన విషయం కాదంటున్నారు. భారత నావికాదళం మాత్రం పాకిస్థాన్.. చైనా సబ్మెరైన్ను లీజుకు తీసుకుని ఉండవచ్చని చెబుతోంది.
క్షిపణి ప్రయోగం.. అంతా వట్టిదేనా, వీడియోలో..: పాక్ నవ్వులపాలయింది!
ప్రస్తుతం అక్కడ సబ్మెరైన్ ఆపరేషన్స్కు సంబంధించి మొదటి బృందానికి శిక్షణ ఇస్తున్నట్లుగా పేర్కొంటోంది. ఒక వేళ పాకిస్తాన్ దీనిని కొనుగోలు చేసినట్లయితే హిందూ మహాసముద్ర తీరంలో ఆయుధ పోటీ మరింత తీవ్రమవుతుందంటున్నారు.
పాక్ చేరిన సబ్మెరైన్ అత్యాధునికమైనది. మొత్తం 7,000 టన్నుల బరువు ఉంది. దీనిలో ఆరు టోర్పిడో ట్యూబ్లు ఉంటాయి. ఇది ప్రస్తుతం చైనా సైన్యంలో సేవలు అందిస్తోంది. దీనికి క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించే సామర్థ్యమూ ఉంది.
ఇటీవల పాక్ పరీక్షించిన బాబర్ క్షిపణిని కూడా దీని నుంచి ప్రయోగించవచ్చు. ఇప్పటి వరకు పాకిస్తాన్ డీజిల్, ఎలక్ట్రిక్ సబ్మెరైన్లను వాడుతోంది. ప్రస్తుత న్యూక్లియర్ జలాంతర్గామి ఒకసారి రియాక్టర్ పని చేయడం ప్రారభమైంతే అది కొనసాగుతుంది.