ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే.. పాక్ మాత్రం ఉగ్రవాదులను కాపాడే పనిలో బిజీ!
ప్రపంచమంతా కరోనావైరస్పై పోరాడుతుంటే.. పాకిస్థాన్ మాత్రం తన ఉగ్ర కార్యకలాపాల్లో మునిగితేలుతోంది. తాము కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం.. ఉగ్రవాద బాధితులం అంటూ దొంగేడుపులు ఏడ్చే పాకిస్థాన్.. మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది.

1800 ఉగ్రవాదుల పేర్లు తొలగింపు..
కరోనా పోరును గాలికొదిలేసిన పాకిస్థాన్.. నిషేధిత ఉగ్రవాదుల జాబితాను సవరించడం గమనార్హం. గుట్టుచప్పుడు కాకుండా 1800 మంది నిషేధిత ఉగ్రవాదుల్ని జాబితా నుంచి తొలగించింది. అందులో 2008 ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తొయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీర్ ఉర్ రెహ్మాన్ లఖ్వీ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఓ సంస్థ బయటపెట్టింది.

బయటపెట్టిన అమెరికా సంస్థ..
న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న క్యాస్టెల్లమ్.ఏఐ అనే టెక్నాలజీ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2018లో నిషేధిత జాబితాలో 7600గా ఉన్న ఉగ్రవాదుల సంఖ్య.. ఇప్పుడు 3800కి చేరడం చేరింది. గత మార్చి నుంచి ఏకంగా 1800 మంది ఉగ్రవాదులను ఈ జాబితా నుంచి తొలగించినట్లు క్యాస్టెల్లమ్ వెల్లడించింది.

గ్రే జాబితా నుంచి తప్పించుకునేందుకే..
పాకిస్థాన్ను ఇప్పటికే ఎఫ్ఏటీఎఫ్(ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) గ్రే జాబితాలో పెట్టిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై జూన్ లో మరోసారి సమీక్ష జరపనుంది. ఈ నేపథ్యంలో బ్లాక్ లిస్ట్ ముప్పు తప్పించుకునేందుకు పాక్ తాజాగా ఈచర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఏఫ్టీఎఫ్ సిఫార్సుల్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని నమ్మబలికించడానికి ఇందుకు సిద్ధమైంది పాకిస్థాన్.
Recommended Video

ప్రపంచానికి తెలియకుండానే..
అయితే, నిషేధిత ఉగ్రవాదుల్ని తొలగించినప్పుడు ఈ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావాలన్న నిబంధనలు ఉండగా.. వాటిని పాకిస్థాన్ లెక్కచేయకపోవడం గమనార్హం. ఈ మేరకు ప్రముఖ అమెరికా దినపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ లో కథనం ప్రచురితమైంది. ఉగ్రవాదులను తొలగించిన తీరు, వేగం పలు అనుమానాలకు తావిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, ఐక్యరాజ్యసమితి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి నిర్దేశించిన లక్ష్యాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్న సూచనలు కూడా విస్మరించింది. ఈ నేపథ్యంలో ఎఫ్ఏటీఎఫ్ మరోసారి పాకిస్థాన్ ను గ్రే జాబితాలోనే కొనసాగిస్తుందా? లేదా? అనేది చర్చకు దారితీసింది. ఓవైపు కరోనా వ్యాపిస్తుంటే.. దేశంలో రంజాన్ వేడుకలు జరుపుకోవచ్చంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలు జారీచేయడం గమనార్హం. పాకిస్థాన్ లో ఇప్పటి వరకు 9214 కరోనా కేసులు నమోదవగా, 192 మంది చనిపోయారు.
-
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications