క్లాస్ రూంలో వరుసగా నిల్చో బెట్టి తలలపై కాల్చారు (ఫోటోలు)
పెషావర్: పాకిస్ధాన్లోని పెషావర్లో ఆర్మీ స్కూలు, కళాశాల వెనుక స్మశాన వాటిక ఉంది. దాని సమీపంలోని గేటు వద్ద నుంచి ఈ ఉదయం ఎనిమిది ఉద్రవాదులు స్కూలు ప్రాంగణంలోకి చొరబడినట్లు అక్కడి ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
తాలిబన్లు ఆర్మీ దుస్తులు ధరించి స్కూలులోకి ప్రవేశించి ముందుగా స్కూలు బస్సును తగులబెట్టి భయాందోళనలు సృష్టించారు. విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సమయంలో పాఠశాలలో మొత్తం 500 మంది విద్యార్థులు, 70 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తోంది.
అనంతరం ఒక్కో క్లాస్ రూంలోకి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల చొరబాటును గమనించిన భద్రతా బలగాలు వెంటనే స్పందించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు తాలిబన్లను ఆర్మీ అధికారులు హతమార్చారు.
ఓ ఉగ్రవాది మానవ బాంబు ద్వారా తనను తానే పేల్చుకున్నట్లు భావిస్తున్నారు. తరగతి గదిలో ఉండగా స్కూల్లో కాల్పుల శబ్దం వచ్చించిందని.. తామంతా భయపడితే, టీచర్ ఆర్మీ ప్రాక్టీస్లో భాగంగా కాల్పులేనని అన్నారని ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకున్న కొందరు పిల్లలు చెప్పారు.

ఆర్మీ స్కూలుపై తాలిబన్ల దాడి
విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. క్లాస్ రూంలోకి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఆర్మీ స్కూలుపై తాలిబన్ల దాడి
తాలిబన్ కాల్పుల దాడిలో 126 మందికిపైగా చిన్నారుల మరణించగా, 80 మందికిపైగా గాయపడినట్లు పాకిస్తాన్ హోం శాఖ ప్రకటించింది. ఒక టీచర్ను సజీవ దహనం చేశారు ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ముష్కరులు 18 నుంచి 20 సంవత్సరాల వయసు లోపు వారని పాక్ మీడియా ప్రకటించింది.

ఆర్మీ స్కూలుపై తాలిబన్ల దాడి
ఓ ఉగ్రవాది మానవ బాంబు ద్వారా తనను తానే పేల్చుకున్నట్లు భావిస్తున్నారు. తరగతి గదిలో ఉండగా స్కూల్లో కాల్పుల శబ్దం వచ్చించిందని.. తామంతా భయపడితే, టీచర్ ఆర్మీ ప్రాక్టీస్లో భాగంగా కాల్పులేనని అన్నారని ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకున్న కొందరు పిల్లలు చెప్పారు.

ఆర్మీ స్కూలుపై తాలిబన్ల దాడి
ఆర్మీ స్కూల్లో బందీలుగా ఉన్న పిల్లల పరిస్ధితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పిల్లల తల్లిదండ్రులు పెషావర్ వీధుల్లో నెత్తీ నోరూ బాదుకుంటూ విలపిస్తున్నారు.

ఆర్మీ స్కూలుపై తాలిబన్ల దాడి
ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సమయంలో పాఠశాలలో మొత్తం 500 మంది విద్యార్థులు, 70 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల చొరబాటును గమనించిన భద్రతా బలగాలు వెంటనే స్పందించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు తాలిబన్లను ఆర్మీ అధికారులు హతమార్చారు.
క్లాస్ రూంలోకి చొరబడి తుపాకీలతో కాలుస్తున్నారని, ఒక్కొక్కరినీ రెండు నుంచి మూడు సార్లు కాలుస్తున్నారని, తన స్నేహితులంతా రక్తపు మడుగులో పడి ఉన్నారని సురక్షితంగా బయటపడిన మరో విద్యార్ది తెలిపాడు.
కొంతమంది విద్యార్ధులు అక్కడి జియో టీవి సిబ్బందితో మాట్లాడుతూ కొంత మంది సైనిక దుస్తులు ధరించి స్కూలు ఆడిటోరియం ద్వారా లోపలికి ప్రవేశించారని తెలిపారు. "లోపలికి రాగానే వారు కాల్పులు జరపడం మొదలు పెట్టారు. మేం వెంటనే భయంతో క్లాస్ రూమ్లోకి వెళ్లిపోయాం. వారు ప్రతి క్లాస్ రూంలోకి వచ్చి విద్యార్ధులను చంపడం మొదలు పెట్టారు." అంటూ ఏడస్తూ చెప్పారు.
ఎక్కువగా తలలపై కల్చారని వైద్యులు స్పష్టీకరణ
ఆర్మీ స్కూల్లో విద్యార్ధులపై ఉగ్రవాదులు జరిగిన కాల్పుల్లో ఎక్కువగా పిల్లలను తలలపై కాల్చినట్లు వారికి చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు. దీనిని బట్టి పిల్లలను అత్యంత దారుణంగా నిలబెట్టి నిర్దాక్షిణ్యంగా కాల్చివేసినట్లు తెలుస్తోంది. పిల్లలకు రక్త స్రావం ఎక్కువగా ఉండటంతో వారికి రక్తం ఎక్కువ మోతాదులో కావాల్సి ఉన్నందున రక్తం ఇచ్చేందుకు ప్రజలు ముందుకు రావాలని వైద్యులు పిలుపునిచ్చారు.
విద్యార్ధులపై ఉగ్రవాదుల దాడి అనాగరిక చర్య: ఇమ్రాన్ ఖాన్
విద్యార్దులపై జరిగిన దాడిని ఆనాగరిక చర్యగా పాకిస్ధాన్ మాజీ క్రికెటర్, రాజకీయ నేత ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయం గురించి విని షాక్కు గురయ్యానని, ఇంత అమానుషంగా ఎలా దాడికి పాల్పడుతున్నారని ఆయన ఉగ్రవాదులన్ని ప్రశ్నించారు.
తాలిబన్ కాల్పుల దాడిలో 126 మందికిపైగా చిన్నారుల మరణించగా, 80 మందికిపైగా గాయపడినట్లు పాకిస్తాన్ హోం శాఖ ప్రకటించింది. ఒక టీచర్ను సజీవ దహనం చేశారు ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ముష్కరులు 18 నుంచి 20 సంవత్సరాల వయసు లోపు వారని పాక్ మీడియా ప్రకటించింది.

ఆర్మీ స్కూలుపై తాలిబన్ల దాడి
విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. క్లాస్ రూంలోకి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఆర్మీ స్కూలుపై తాలిబన్ల దాడి
తాలిబన్ కాల్పుల దాడిలో 126 మందికిపైగా చిన్నారుల మరణించగా, 80 మందికిపైగా గాయపడినట్లు పాకిస్తాన్ హోం శాఖ ప్రకటించింది. ఒక టీచర్ను సజీవ దహనం చేశారు ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ముష్కరులు 18 నుంచి 20 సంవత్సరాల వయసు లోపు వారని పాక్ మీడియా ప్రకటించింది.

ఆర్మీ స్కూలుపై తాలిబన్ల దాడి
ఓ ఉగ్రవాది మానవ బాంబు ద్వారా తనను తానే పేల్చుకున్నట్లు భావిస్తున్నారు. తరగతి గదిలో ఉండగా స్కూల్లో కాల్పుల శబ్దం వచ్చించిందని.. తామంతా భయపడితే, టీచర్ ఆర్మీ ప్రాక్టీస్లో భాగంగా కాల్పులేనని అన్నారని ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకున్న కొందరు పిల్లలు చెప్పారు.

ఆర్మీ స్కూలుపై తాలిబన్ల దాడి
ఆర్మీ స్కూల్లో బందీలుగా ఉన్న పిల్లల పరిస్ధితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పిల్లల తల్లిదండ్రులు పెషావర్ వీధుల్లో నెత్తీ నోరూ బాదుకుంటూ విలపిస్తున్నారు.

ఆర్మీ స్కూలుపై తాలిబన్ల దాడి
ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సమయంలో పాఠశాలలో మొత్తం 500 మంది విద్యార్థులు, 70 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల చొరబాటును గమనించిన భద్రతా బలగాలు వెంటనే స్పందించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు తాలిబన్లను ఆర్మీ అధికారులు హతమార్చారు.
ఉగ్రవాదంపై గట్టి పోరాటం చేద్దాం: జైట్లీ
పెషావర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్పై తాలిబన్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని కేంద్ర మంత్రి అరుణా జైట్లీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం, ఉగ్రవాద దాడులపై పటిష్టమైన పోరాటం చేద్దామని జైట్లీ ట్వీట్ చేశారు.
Peshawar Army Public School terror attack is highly condemnable. Let us put a tough fight against terror-violence and terrorism globally.
— Arun Jaitley (@arunjaitley) December 16, 2014 అత్యంత భయానక చర్య: డేవిడ్ కామెరూన్
పెషావర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్పై తాలిబన్ల దాడి ఘటన గురించి విని షాక్కు గురైనట్లు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిని అత్యంత భయానక చర్యగా ఆయన అభివర్ణించారు.
The news from Pakistan is deeply shocking. It's horrifying that children are being killed simply for going to school.
— David Cameron (@David_Cameron) December 16, 2014 











Click it and Unblock the Notifications