శారీరక సంబంధం కొనసాగించడం లేదని భార్యను ఏం చేశాడంటే?
తన భార్యతో తన వైవాహిక బంధంపై విసుగు చెందిన భర్త ప్లాన్ ప్రకారంగా భార్యను హత్య చేశాడు. ఈ ఘటన అమెరికాలోని సీటెల్ లో చోటుచేసుకొంది.
వాషింగ్టన్: తన భార్యతో తన వైవాహిక బంధంపై విసుగు చెందిన భర్త ప్లాన్ ప్రకారంగా భార్యను హత్య చేశాడు. ఈ ఘటన అమెరికాలోని సీటెల్ లో చోటుచేసుకొంది.
నిందితుడిని సోమవారం నాడు కోర్టులో హజరుపర్చారు. నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కామెరూన్ జాన్, ఎస్పీటియా , జెన్నీఫర్ ఎస్పీటియా భార్య,భర్తలు. సీటెల్ లో నివాసం ఉంటున్నారు.
కామెరాన్ అమెరికా కోస్ట్ గార్డల్ విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలంగా భార్య జెన్నీఫర్ తో ఆయనకు విబేధాలున్నాయి. ఆమెతో సంసారబంధం కొనసాగకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కామెరూన్ భార్యను హత్య చేయాలని ప్లాన్ చేశారు.
ప్లాన్ ప్రకారంగా రైడ్ వెళ్దామని జెన్నిఫర్ ను ఒప్పించి ఉబేర్ క్యాబ్ ను బుక్ చేశాడు. మద్యం మత్తులో ఉన్న కామెరాన్ క్యాబ్ ఎక్కినప్పటి నుండి భార్యతో గొడవపడుతూనే ఉన్నాడు.
కొంతసేపటి తర్వాత క్యాబ్ డ్రైవర్ పెద్ద శబ్దం విన్నాడు. కారు టైర్ పేలిందని కంగారుపడి వెనక్కి తిరిగిచూసి షాక్ తిన్నాడు. జెన్పిఫర్ ఆమె సీట్లో నిర్జీవంగా పడి ఉంది.
అయితే తీవ్ర భయాందోళనలకు గురైన క్యాబ్ డ్రైవర్ నిందితుడు కోరిన చోట కారు ఆపాడు. భార్య మృతదేహన్ని దించి డ్రైవర్ కు డబ్బులు చెల్లించాడు.
ఈ విషయాన్ని ఉబేర్ డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. ఆ సమాచారంతో నిందితుడు కామెరాన్ ఇంటికి వెళ్ళిపోలీసులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు. జెన్నిఫర్ మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
తన భార్య తనతో శారీరం సంబంధం కొనసాగించడం లేదని, అందుకే ఆమెను తుపాకీతో కాల్చిచంపినిట్టు కామెరాన్ హత్య చేశాడు.