బ్రిటన్లో మోడీ ఎక్స్ ప్రెస్ బస్సు ప్రారంభం
లండన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటనను విజయవంతం చెయ్యడానికి అక్కడి ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) సిద్దమయ్యారు. నెల రోజుల పాటు బ్రిటన్ లోని ప్రసిద్ధి చెందిన ప్రాంతాలలో మోడీ ఎక్స్ ప్రెస్ పేరుతో బస్సు యాత్ర మొదలు పెట్టారు.
ఆదివారం ఈ యాత్ర ప్రారంభమైందని నరేంద్ర మోడీ స్వాగత కమిటి ప్రతినిధి మయూరి పార్కర్ తెలిపారు. బ్రిటన్లో లిటిల్ ఇండియాగా ప్రఖ్యాంతి గాంచిన వెంబ్లే లోని ఈ లింగ్ రోడ్డుకు ముందుగా ఈ బస్సు చేరుకుంటుంది. తరువాత బ్రిటన్ లో ప్రసిద్ధి చెందిన నగరాలలో సంచరిస్తుంది.

దీపావళి పండగ నాటికి టాఫల్ గర్ స్క్వేర్ కు ఈ బస్సు చేరుకుంటుందని వివరించారు. వచ్చే నెల ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ మొదటి సారి బ్రిటన్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బస్సు పే చర్చ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని ప్రవాస భారతీయులు చెప్పారు.
నవంబర్ 13వ తేదిన వెంబ్లే స్టేడియంలో మోడీకి ఒలంపిక్స్ తరహాలో స్వాగతం చెప్పడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే వందలాది మంది ప్రవాస భారతీయులు వారి పేర్లు నమోదు చేసుకున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications