ప్రిన్సెస్ లతీఫా: బందీగా మారిన దుబయి రాకుమార్తె బతికే ఉన్నారా.. ఆ ఇన్స్టాగ్రామ్ ఫొటోలు ఏం చెబుతున్నాయి.. ఆమె ఎక్కడున్నారు
దుబయి పాలకుడు కుమార్తె ప్రిన్సెస్ లతీఫా తన స్నేహితులతో కనిపిస్తున్న ఓ ఫోటోను రెండు ఇన్స్టాగ్రామ్ ఖాతాల నుంచి ఇటీవల పోస్ట్ చేశారు. అంతకు కొన్నినెలల ముందు నుంచి లతీఫా కనిపించడం లేదు.
గత ఫిబ్రవరిలో లతీఫా మాట్లాడుతున్న సీక్రెట్ వీడియోను 'బీబీసీ పనోరమ’ ప్రసారం చేసింది. తనను నిర్బంధించారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని లతీఫా ఆ వీడియోలో చెప్పారు.
తాజా ఫోటోను బీబీసీ ధ్రువీకరించలేదు. ఈ ఫోటోకు సంబంధించి ఎలాంటి వివరాలు లభించలేదు.
ఈ ఫోటోను అనుకోకుండా పోస్ట్ చేయలేదని, ఆమె అదృశ్యానికి సంబంధించిన అంశాలతో దీనికి సంబంధముందని బీబీసీ భావిస్తోంది.
''ఆమె విషయంలో కొన్ని సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నట్లు మేం ధ్రువీకరిస్తున్నాం. ఈ దశలో ఇంతకుమించి మేం మాట్లాడలేం. తగిన సమయంలో పూర్తి వివరాలతో ప్రకటన విడుదల చేస్తాం’’అని ఫ్రీ లతీఫా క్యాంపెయిన్ గ్రూప్ కో ఫౌండర్ డేవిడ్ హై చెప్పారు.
బీబీసీ అడిగిన ప్రశ్నలకు లండన్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఎంబసీ స్పందించలేదు.
మరోవైపు ఐక్యరాజ్యసమితి కూడా ఫోటోపై స్పందించేందుకు నిరాకరించింది. ''లతీఫా జీవించి ఉన్నారనే రుజువు చేసే ఆధారాల కోసం మేం ఎదురుచూస్తున్నాం’’అని తెలిపింది. యూఏఈ ఈ ఆధారాలను ఐరాసకు సమర్పించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్-గాజా హింస: ఇజ్రాయెల్ దాడిలో మీడియా కార్యాలయాలున్న భారీ భవనం కూలిపోయింది
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- భారత్కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన 'బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)