షేక్హ్యాండ్: ఆడ, మగ కవులకు కొరడా దెబ్బలు!
టెహ్రాన్: సాంప్రదాయ ఇరాన్ దేశంలో కవులకు, కళాకారులకు కష్టకాలం కొనసాగుతూనే ఉంది. కోర్టు తీర్పులతో అక్కడి ప్రభుత్వం కవుల స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తోంది. తాజాగా ఆడ, మగ కవులు షేక్ హ్యాండ్ ఇచ్చి పుచ్చుకున్నారనే కారణంగా వారికి కొరడా దెబ్బల శిక్ష విధించింది. ఈ మేరకు అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది.
మిగతా కవులతో షేక్ హ్యాండ్ చేసినందుకు.. ప్రముఖ రచయితలు ఫాతిమా ఏక్తేసరీ, మోహిదీ ముసవి జంటకు ఇరాన్ కోర్టు కఠినమైన శిక్షను విధించింది. ఈ ఇద్దరికీ 99 కొరడా దెబ్బలు అమలు చేయాలని ఆదేశించింది.

గతంలో ఈ జంట కవులు ప్రభుత్వ అనుమతితోనే పుస్తకాలను ప్రచురించారు. అయితే ఇటీవల ఇరాన్లో రచయితలపై అణిచివేత విపరీతంగా పెరిగిపోయింది.
గత ఏడాది 30 మంది జర్నలిస్టులకు ఇరాన్ ప్రభుత్వం ఈ శిక్ష అమలు చేసింది. దేశాధ్యక్షుడు హసన్ రోహానీ పాలనలో కవులపై ఎదురుదాడి మరింత ముదిరిందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
-
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్ -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
హార్ముజ్ లో జాంబీ షిప్ ? ఐదేళ్ల క్రితం మాయమై.. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష్యం..! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
1970ల నాటి చీకటి రోజులు మళ్లీ: సంచలన హెచ్చరిక!












Click it and Unblock the Notifications