మరోసారి ముందంజలో రిషి సునాక్ - ప్రథమ శత్రువంటూ : ప్రధాని పదవి దిశగా..!!
బ్రిటన్ పదవి రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ మరోసారి ముందంజలో నిలిచారు. కన్జర్వేటివ్ పార్టీ అధినేత పదవి కోసం నిర్వహించిన రెండో దశ ఎన్నికలో అత్యధికంగా 101 మంది ఎంపీలు సునాక్కు మద్దతు తెలిపారు. క్రమక్రమంగా పట్టు బిగిస్తున్నారు. దాంతో పాటు తదుపరి రౌండ్కు అర్హత సాధించారు. రెండో రౌండ్ ముగిసే సమయానికి రుషి తరువాతి స్థానాల్లో వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్ (83 ఓట్లు), విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ (64 ఓట్లు), మాజీ మంత్రి కెమీ బదెనోచ్ (49 ఓట్లు), టోరీ బ్యాక్బెంచర్ టామ్ తుగెన్ధాట్ (32 ఓట్లు) వరుసగా నిలిచారు.

ప్రధారి రేసులో అయిదుగురు పోటీ
వీరంతా వచ్చే వారం జరగబోయే తదుపరి రౌండ్లో పోటీ పడనున్నారు. భారత సంతతికి చెందిన మరో అభ్యర్థి ఆటార్నీ జనరల్ సుయెలా బ్రావెర్మన్.. రెండో రౌండ్లో 27 ఓట్లు రావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. మొదటి రౌండ్లోనూ సునాక్.. 88 ఓట్లతో తొలి స్థానంలో నిలిచారు. ప్రజలను పేదరికంలోకి నెట్టివేస్తున్న ద్రవ్యోల్బణమే తన ప్రథమ శత్రువని రుషి పేర్కొన్నారు. రెండో రౌండ్ లోనూ దూసుకెళ్తున్న రుషి తన లక్ష్యాలను ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసారు. ప్రజలపై పన్ను భారాన్ని తగ్గిస్తానని వెల్లడించారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇవన్నీ చెప్పటం లేదన్నారు.

బ్రిటన్ కు సేవ చేయటం కోసమే
ప్రజలను పేదరికంలో నెట్టేస్తున్న ద్రవ్యోల్బణమే తన శత్రువని తేల్చి చెప్పారు. 2024లో పార్లమెంటు ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీని ఓడించగల సమర్థుడైన టోరీ నేతను తానేనని ధీమా వ్యక్తంచేశారు. బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో తాను చేరడానికి కొన్ని నెలల ముందు వరకూ అమెరికా గ్రీన్ కార్డును కలిగి ఉన్నానని, రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత ఆ దేశంలోనే స్థిరపడతానని తనపై వస్తున్న విమర్శలను రిషి తోసిపుచ్చారు. అమెరికాలో చదువుకున్న తాను..అక్కడే ఉద్యోగం చేశానని గుర్తు చేసారు. అయితే, బ్రిటన్ కు సేవ చేయటం కోసమే తిరిగి వచ్చానన్నారు.

అదృష్టం వరిస్తే బ్రిటన్ ప్రధాన మంత్రిగా
అదృష్టం వరిస్తే బ్రిటన్ ప్రధాన మంత్రిని అవుతానని చెప్పారు. సవాళ్లతో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని సమర్థంగా నడిపించగలనని.. నిజాయితీగా, బాధ్యతాయుతంగా ఆ విధులను నిర్వర్తిస్తా. అందుకు అవసరమైన శక్తిసామర్థ్యాలు, అనుభవం తనకు ఉన్నాయని వివరించారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుడిగా శ్రమను, జీవితంలో ఎదగాలన్న కలలను నమ్ముకున్న వ్యక్తిగా తన గురించి వివరించారు. ఇతర దేశాల వారిని సాదరంగా స్వాగతించే సగర్వమైన చరిత్ర బ్రిటన్ సొంతమన్నారు. ఈ నెల 21న ప్రధాని పదవి కోసం నిలిచే తుది పోరులో ఇద్దరి పేర్లు ఖరారు కానున్నాయి. సెప్టెంబర్ 5న ఎన్నికలు జరుగుతాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications