Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Russian Ukraine War: లక్ష మందిని పంపించేశాము, చేసిన పాపం ఊరికేపోదు, జెలెన్ స్కీ ఫైర్ !

ఉక్రెయిన్: రష్యా ఆరాచకాలకు అడ్డుఅదుపు లేకుండాపోయిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్పుల విరామం (యుద్ద విరామం) ఉల్లంఘనకు పాల్పడిన రష్యా బలగాలు ఆసుపత్రుల మీద దాడులు చేస్తోందని, అమాయకులు బలి అవుతున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. మానవతా విలువలు కాలరాస్తున్న రష్యాకు సరైన బుద్ది చెబుతామని జెలెన్ స్కీ హెచ్చరించారు. రష్యా దాడులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంతో పాటు మరియుపోల్ నగరంలోని ప్రజలు ఆహారం, తాగడానికి నీళ్లు అందకపోవడంతో అలమటిస్తున్న లక్ష మంది సామాన్య ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చెప్పారు. యుద్ద విరామం ప్రకటించామని పైకి చెబుతున్న రష్యా బలగాలు దొంగచాటుగా ఆసుపత్రులు, సామాన్య ప్రజలు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో దాడులు చేస్తోందని, అమాయకులు ఏం పాపం చేశారు అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రశ్నించారు. ఇప్పటికే 20 లక్షల మందికి పైగా ఉక్రెయిన్ జాతీయులు పొరుగు దేశాలకు వలసలు వెళ్లారు. అందులో సగానికి సగం చిన్నారులే ఉన్నారని ప్రత్యక్ష సాక్షలు అంటున్నారని అంతర్జాతీయ మీడియా అంటోంది. ఇంత జరుగుతున్నా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

Recommended Video

    Russia Ukraine Conflict : Volodymyr Zelensky సంచలన నిర్ణయం..యుద్ధం ముగిసినా ? | Oneindia Telugu

    రష్యా అరాచకాలు ఎక్కువైనాయి

    రష్యా అరాచకాలు ఎక్కువైనాయి

    రష్యా ఆరాచకాలకు అడ్డుఅదుపు లేకుండాపోయిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా మీద పగతో రగిలిపోతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అమాయకులైన ప్రజల మీద దాడులు చేసి పరోక్షంగా మా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు.

    యుద్ద విరామం అంటూనే దాడులు చేస్తారా ?

    యుద్ద విరామం అంటూనే దాడులు చేస్తారా ?


    కాల్పుల విరామం ఉల్లంఘనకు పాల్పడిన రష్యా బలగాలు ఆసుపత్రుల మీద దాడులు చేస్తోందని, అమాయకులు బలి అవుతున్నారని, యుద్ద విరామం అని ప్రపంచ దేశాలకు నమ్మిస్తున్న రష్యా పదేపదే దాడులు చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. మానవతా విలువలు కాలరాస్తున్న రష్యాకు సరైన బుద్ది చెబుతామని జెలెన్ స్కీ హెచ్చరించారు.

     రెండు రోజుల్లో లక్ష మందిని తరలించాము

    రెండు రోజుల్లో లక్ష మందిని తరలించాము

    రష్యా దాడులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంతో పాటు మరియుపోల్ నగరంలోని ప్రజలు ఆహారం, తాగడానికి నీళ్లు అందకపోవడంతో అలమటిస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు రోజుల నుంచి మరియుపోల్ నగరంలోని లక్ష మంది సామాన్య ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చెప్పారు.

    సామాన్య ప్రజలు ఏం పాపం చేశారు ?

    సామాన్య ప్రజలు ఏం పాపం చేశారు ?

    యుద్ద విరామం ప్రకటించామని పైకి చెబుతున్న రష్యా బలగాలు దొంగచాటుగా ఆసుపత్రులు, సామాన్య ప్రజలు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో దాడులు చేస్తోందని, అమాయకులు ఏం పాపం చేశారు అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రశ్నించారు. అమాయకుల ప్రాణాలు తీస్తున్న రష్యాకు ఉసురు తగులుతుందని, చేసిన పాపం ఊరికేపోదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు.

     20 లక్షల మంది పారిపోయారు

    20 లక్షల మంది పారిపోయారు


    ఇప్పటికే 20 లక్షల మందికి పైగా ఉక్రెయిన్ జాతీయులు పొరుగు దేశాలకు వలసలు వెళ్లారు. అందులో సగానికి సగం చిన్నారులే ఉన్నారని ప్రత్యక్ష సాక్షలు అంటున్నారని అంతర్జాతీయ మీడియా అంటోంది. ఇంత జరుగుతున్నా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+