పాక్లో మానవహక్కుల మహిళ నేత కాల్చివేత
కరాచి: పాకిస్థాన్ లో తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఒక కార్యక్రమంలో పాల్గొని బయటకు వస్తున్నమానవ హక్కుల మహిళ నేతను దారుణంగా కాల్చి చంపేశారు. సబీన్ మహమ్మద్ (40) అనే మహిళ హత్యకు గురైనారు. ఆమె తల్లికి బుల్లెట్ గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు.
శుక్రవారం రాత్రి కరాచిలోని ఒక హోటల్ లో సైలెన్సింగ్ బెలూచిస్థాన్ పేరుతో ఒక సెమినార్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సబీన్ మహమ్మద్ పాల్గోని ప్రసంగించారు. తరువాత తల్లితో కలిసి కారులో వేరే కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరారు.

హోటల్ నుండి బయటకు వస్తున్న సమయంలో ఇద్దరు తీవ్రవాదులు కారు మీద తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. తీవ్రగాయాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.
చికిత్స విఫలమై సబీన్ మహమ్మద్ మరణించారని పోలీసు అధికారి తారిఖ్ దరేజో తెలిపారు. బెలూచిస్తాన్ లో అమాయకులను పోలీసులు నిర్దాక్షణంగా కాల్చి చంపుతున్నారని ఆరోపిస్తూ ఈమె చాల సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications