ట్రంప్పై సద్దాం హుస్సేన్ కూతురు కామెంట్స్: 'ఆ వీడియో ఎప్పటికీ చూడను!'
ట్రంప్ కు రాజకీయాలకు కొత్తయినా.. అతనిలో రాజకీయ సున్నితత్వం ఉందని ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్ కూతురు రగద్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు.
జోర్డాన్ : ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్ కూతురు రగద్ హుస్సేన్ అమెరికా కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎన్ఎన్ ఛానల్తో ఫోన్ ఇంటర్వ్యూ సందర్భంగా ట్రంప్ పేరును ప్రస్తావించారు రగద్.
ట్రంప్ కు రాజకీయాలకు కొత్తయినా.. అతనిలో రాజకీయ సున్నితత్వం ఉందని ఈ సందర్బంగా రగద్ అభిప్రాయపడ్డారు.గతంలో అమెరికాను పాలించిన నేతల కన్నా, ట్రంప్ భిన్నంగా ఉన్నట్లు రగద్ హుస్సేన్ పేర్కొనడం గమనార్హం. ఇరాక్ తో యుద్దం విషయంలో గత ప్రభుత్వాల తీరును ట్రంప్ తప్పుబట్టారని, దీన్నిబట్టి చూస్తే.. ఇరాక్ యుద్దం వల్ల అమెరికా చేసిన పొరపాటును ట్రంప్ గ్రహించారని రగద్ తెలిపారు.

తన తండ్రి సద్ధాం హుస్సేన్కు ఎలా అన్యాయం జరిగిందన్న విషయం కూడా ట్రంప్ కు తెలుసునని రగద్ చెప్పారు. కాగా, 1979 నుంచి 2003 వరకు ఇరాక్ను సద్ధాం పాలించిన సంగతి తెలిసిందే. సద్దాం పాలనలో షియాలు భారీ ఊచకోతకు గురయ్యారు. ఇదే సమయంలో అణ్వాయుధాలున్న నెపంతో అమెరికా సేనలు ఇరాక్లో భారీ విధ్వంసం సృష్టించాయి.
యుద్ద నేరాల కింద సద్దాంను అరెస్టు చేసిన అమెరికా.. 2006లో ఉరితీసింది. దాన్ని ఇరాకీ టీవీ లైవ్ ప్రసారం చేయగా.. తన తండ్రి ఉరితీత వీడియోను తానెప్పటికీ చూడబోనని రగద్ తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications