టెర్రరిస్తులనుకొని టూరిస్టులను కాల్చి చంపేశారు
కైరో: ఈజిప్టు భద్రతా బలగాలు ఘోరా తప్పిదానికి పాల్పడి పాపం మూట కట్టుకున్నారు. విహారయాత్రకు వచ్చిన విదేశీ టూరిస్టులను పిట్టలను కాల్చినట్లు కాల్చేశారు. 10 మంది టూరిస్టులు బుల్లెట్ గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
12 మంది పర్యాటకుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో ఈ ఘటన సంచలనానికి తెరతీసింది. ఈజిప్టులో అక్కడి భద్రతా బలగాలు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులను అంతం చేస్తున్నాయి. గత ఆరు రోజుల నుంచి వరుసగా ఉగ్రవాదలు మీద దాడులు చేస్తున్నారు.
ఈజిప్టులోని అల వాహత్ అనే భాగం నిషేధిత ప్రాంతం. నాలుగు వాహనాల్లో మెక్సికన్ టూరిస్టులు ఆదివారం సాయంత్రం అనుకోకుండా ఆ ప్రాంతంలోకి వెళ్లారు. అప్పటి వరకు ఉగ్రవాదుల మీద దాడులు చేసిన ఈజిప్టు సైన్యం టూరిస్టులు వెలుతున్న వాహనాలు గుర్తించారు.

ఆ వాహనాలలో ఉన్న వారు ఉగ్రవాదులు అనుకుని ఒక్క సారిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. సైన్యం జరిపిన కాల్పులలో 12 మంది టూరిస్టులు సంఘటనా స్థలంలో మరణించారు. మరో పది మంది మెక్సికో, ఈజిప్టు టూరిస్టులకు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు.
ఈజిప్టుకు ప్రధానంగా టూరిజం నుంచి ఆదాయం వస్తున్నది. ఈ ఘటనతో టూరిజంపై కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. అయితే మెక్సికో మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకు ఏ విధంగా స్పందించలేదు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications